Bhamakalapam: రూ. 200 కోట్ల గుడ్డు కథ.. అలరిస్తున్న ‘భామా కలాపం’ ట్రైలర్‌

ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ఓటీటీ చిత్రం ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకుడు.

Published : 01 Feb 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ఓటీటీ చిత్రం ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో యువ నటుడు విజయ్‌ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కోల్‌కతా మ్యూజియంలో అపహరణకు గురైన రూ. 200 కోట్ల గుడ్డు చుట్టూ తిరిగే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. ఇందులో.. ప్రియమణి కుకింగ్‌ ఎక్స్‌పర్ట్‌ అనుపమగా కనిపించింది. ‘వాసన చూసి కూరలో ఉప్పు ఎక్కువైందో, తక్కువైందో చెప్పగలను’ అని ఆమె చెప్పిన సంభాషణ అలరిస్తోంది. తన వంటలతో యూట్యూబ్‌ వేదికగా ఎంతగానో పేరుతెచ్చుకున్న అనుపమకి ఆ విలువైన గుడ్డు ఎలా దొరికిందనేది ఆసక్తికరం. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను బాపినీడు, సుధీర్‌ నిర్మించారు. దర్శకుడు భరత్‌ కమ్మ సమర్పిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూర్చగా మార్క్‌ కె. రాబిన్‌ నేపథ్య సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని