Chiranjeevi: ‘ఆచార్య’లో మహేశ్‌ కూడా భాగమే.. చిరంజీవి ట్వీట్‌

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటించిన ‘ఆచార్య’లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా భాగమయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం....

Updated : 21 Nov 2022 16:22 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటించిన ‘ఆచార్య’లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా భాగమయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో మహేశ్‌ కూడా ఉన్నారంటూ ఇటీవల వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలో పలువురు అభిమానులు, నెటిజన్లు.. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఇవ్వాలంటూ చరణ్‌, చిరు, నిర్మాణ సంస్థలకు వరుస పోస్టులు పెట్టారు. కాగా, అభిమానుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులపై తాజాగా చిరు స్పందించారు.

‘డియర్‌ మహేశ్‌.. ‘ఆచార్య’లోని పాదఘట్టాన్ని నీ వాయిస్‌ ఓవర్‌తో అందరికీ పరిచయం చేయనున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన విధంగా ఈ సినిమాలో నువ్వు కూడా భాగమైనందుకు ధన్యవాదాలు. నీ వాయిస్‌ విని నేనూ, చరణ్‌ ఎంతలా థ్రిల్‌ అయ్యామో.. అదేవిధంగా అభిమానులు, ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు’’ అని చిరు ట్వీట్‌ చేశారు.

ఇక, ‘ఆచార్య’ విషయానికి వస్తే కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవాలయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం ‘ధర్మస్థలి’ పేరుతో ఓ భారీ సెట్‌ని క్రియేట్‌ చేశారు. పూజా హెగ్డే, కాజల్‌ కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్‌ 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని