Chiranjeevi: ఆ సంతోషాన్ని మాటల్లో వివరించలేను: చిరంజీవి
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’.. ఈ సినిమా విజయోత్సవ వేడుకకు ప్రముఖ హీరో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: తనతోపాటు తన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు విజయం సాధించడంపై అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi) హర్షం వ్యక్తం చేశారు. ఆ సంతోషాన్ని మాటల్లో వివరించలేనన్నారు. ‘బేబీ’ (Baby) సినిమా విజయోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహిచింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజమైన ‘గేమ్ ఛేంజర్’ ఆయనే: రామ్చరణ్
వేడుకనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ వాతావరణం చూస్తుంటే బేబీ సినిమా విజయోత్సవ వేడుకకు వచ్చానో, నా సన్మాన సభకు వచ్చానో అర్థం కావడంలేదు. పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నా.. తోబుట్టువుల అభివృద్ధి చూసి ఆనందిస్తున్నా.. నా మేనల్లుళ్లు, మిత్రులు నాతోపాటు ఎదుగుతూ విజయాలు అందుకుంటుంటే ఆ సంతోషం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు నా అభిమానులు. వీరిలో చాలామంది నన్ను స్ఫూర్తిగా తీసుకుని, చిత్ర పరిశ్రమకు వచ్చి తమకంటూ ప్రత్యేకత గుర్తింపు పొందుతున్నారు. దాన్ని చూసి నేను పొందే ఉత్సాహం అంతా ఇంతా కాదు. బేబీ సినిమా దర్శక, నిర్మాతలు సాయి రాజేశ్, ఎస్.కె.ఎన్. నాకు ఎప్పటి నుంచో తెలుసు. తరచూ కలవపోయినా వారి ప్రయాణాన్ని గమనిస్తూనే ఉన్నా. అభిమానులుగా థియేటర్ల దగ్గరే ఆగిపోకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ విషయంలో నాకంటే ఎక్కువగా ఆనందించేవారుండరు. సినిమా అభిమానులంటే ఒకప్పుడు కొందరిలో దురాభిప్రాయం ఉండేది. ఇదే ఇండస్ట్రీలో ఉండి.. సమాజం గర్వపడేలా నా అభిమానుల్ని తీర్చిదిద్దాలని నా కెరీర్ ప్రారంభంలోనే నిర్ణయించుకున్నా. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానుల్ని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. నా అభిమానుల ప్రయత్నం ఇంత విజయం సాధించినందుకు అభినందించడానికే ఇక్కడకు వచ్చా’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ది గోట్’.. అప్డేట్ షేర్ చేసిన దర్శకుడు
విజయ్ ‘ది గోట్’పై దర్శకుడు వెంకట్ ప్రభు అప్డేట్ ఇచ్చారు. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్. -
‘కన్నప్ప’లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరోయిన్ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్ట్ పెట్టింది. -
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్2: శౌర్యంగపర్వం’లో మరో మలయాళ నటుడు వచ్చి చేరారు. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్ మూవీ సాంగ్పై నిర్మాత ఆసక్తికర ట్వీట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా తొలి గీతంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే!
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్ పెట్టారు. -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్