పవన్‌తో రానా ‘ఢీ’.. వెన్నెలగా సాయి పల్లవి

పవన్‌కల్యాణ్‌-రానా కీలక పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా వస్తున్న

Published : 29 Jan 2021 02:04 IST

* పవన్‌కల్యాణ్‌-రానా కీలక పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. గురువారం నుంచి రానా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

* బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా క్రికెట్‌ ఆడుతూ సరదాగా గడుపుతున్నారు.

* నటి శ్రద్ధాదాస్‌ జంక్‌ఫుడ్‌ తిందామనుకున్న ప్రతిసారీ అంతరాత్మ అడ్డుచెబుతోందట. చిప్స్‌ తిందామని తెరిచిన డబ్బాను బాధపడుతూ పక్కన పెట్టేశారు.

* రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. సాయి పల్లవి కథానాయిక. ఇందులో ఆమె వెన్నెల అనే పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అంతేకాదు, లుక్‌ను కూడా పంచుకుంది. ఏప్రిల్‌ 30న ఈ సినిమా విడుదల కానుంది.

* కథానాయిక నిక్రీ గల్రాని కోతులతో సరదాగా గడిపారు. వాటికి బిస్కెట్లు అందిస్తూ తెగ సంబరపడిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న విశేషాలు మీకోసం..















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని