Dhanush: క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు కట్టాల్సి ఉంటుంది: ధనుష్‌

ఇంతకాలం తమ పరువుకు భంగం కలిగించిందిచాలని, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్లు కట్టాల్సి ఉంటుందంటూ ఓ దంపతులకు నటుడు ధనుష్....

Published : 22 May 2022 10:40 IST

చెన్నై: ఇంతకాలం తమ పరువుకు భంగం కలిగించింది చాలని, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఓ దంపతులకు నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా లీగల్‌ నోటీసులు పంపించారు. ధనుష్‌ తమ మూడో కుమారుడని, సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడంటూ మధురైకి చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు నాలుగేళ్ల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. నటుడిగా స్థిరపడిన నాటి నుంచి ధనుష్‌ తమకు ప్రతి నెలా రూ.65 వేలు పంపిస్తున్నారని ఆ దంపతులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో విసిగిపోయిన ధనుష్‌, ఆయన తండ్రి కసూర్తిరాజా.. తాజాగా ఆ దంపతులకు లీగల్‌ నోటీసులు పంపించారు. తమ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తోన్న ఆరోపణలకు ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. ఇంతకాలం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ క్షమాపణలు చెబుతూ ఓ స్టేట్‌మెంట్‌ని వెంటనే విడుదల చేయాలని ధనుష్‌ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని