Mahesh babu: మహేశ్‌ బాబుతో సినిమా తీసి ఆ బాకీ తీర్చుకుంటా..: ఎస్‌.జె. సూర్య

ఎస్‌.జె. సూర్య (S J Suryah) నటించిన తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటొని’ (Mark Antony). ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో మహేశ్‌ బాబు (mahesh babu) గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 12 Sep 2023 11:26 IST

హైదరాబాద్‌: దర్శకుడిగా అలరిస్తూనే.. నటుడిగాను మెప్పిస్తుంటారు ఎస్‌.జె. సూర్య (S J Suryah). తాజాగా విశాల్‌తో కలిసి ఆయన నటించిన సినిమా ‘మార్క్‌ ఆంటొని’ (Mark Antony). ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో మహేశ్‌ బాబు (mahesh babu) గురించి ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అవి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

‘‘ఇప్పటి వరకూ దర్శకుడిగా చాలామంది హీరోలకు సూపర్ హిట్‌లు అందించాను. తమిళంలో అజిత్‌, విజయ్‌లతో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీశాను. అలాగే తెలుగులోనూ పవన్‌ కల్యాణ్‌తో ‘ఖుషి’ తీసి మంచి విజయాన్ని అందుకున్నాను. కానీ, మహేశ్‌ బాబుకు మాత్రం ‘నాని’తో హిట్‌ను అందించలేకపోయాను. ఆయనకు బాకీ పడ్డాను. త్వరలోనే ఆయనతో మంచి సినిమా తీసి ఆ బాకీ తీర్చుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ చూసి.. ‘ఏ సినిమాకైనా సీక్వెల్‌ తీస్తారా?’ అంటూ మహేశ్‌ అభిమానులు అడుగుతున్నారు.

భాజపాతో సమస్య ఉంటే.. నాతో వాగ్వాదమెందుకు?: నెటిజన్‌కు రష్మి చురక

ఇక 2004లో ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా ‘నాని’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. భిన్నమైన కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్‌ను అందుకోలేకపోయింది. కానీ, ఈ సినిమాలో మహేశ్‌ నటన, ఏఆర్ రెహమాన్‌ సంగీతానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అలాగే 2017లో మహేశ్‌ హీరోగా నటించిన స్పైడర్‌ చిత్రంలో ఎస్‌.జె సూర్య విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని