BhagavanthKesari: మేం చెప్పాల్సిన పనిలేదు.. ప్రేక్షకులే చెప్పారు: అనిల్‌ రావిపూడి

‘భగవంత్‌ కేసరి’ విజయోత్సవ వేడుకల్లో భాగంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లోని థియేటర్లను సందర్శించారు.

Published : 28 Oct 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). ప్రస్తుతం ‘భగవంత్‌ కేసరి’ (BhagavanthKesari) విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడలోని థియేటర్లను సందర్శంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక మీడియాతో ముచ్చటించారు. ‘దసరా బ్లాక్‌బస్టర్‌ మీదేనా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘100 శాతం. అది మేం చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులే చెప్పారు’ అని సమాధానమిచ్చారు. కలెక్షన్స్‌పై స్పందిస్తూ.. సినిమా ఎంతైతే వసూళ్లు చేస్తుందో ఆ వాస్తవాన్నే ప్రొడక్షన్‌ హౌస్‌ షైన్‌ స్క్రీన్స్‌ చెబుతుందని, ఇతరులు ఇచ్చే రిపోర్ట్‌ గురించి తనకు తెలియదన్నారు. కలెక్షన్స్‌తోపాటు ప్రేక్షకుల ప్రశంసలు అరుదుగా లభిస్తుంటాయని, అది ‘భగవంత్‌ కేసరి’ విషయంలో జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించిన తర్వాతే తదుపరి ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానని చెప్పారు. ఆయన వెంట నటి శ్రీలీల తదితరులు ఉన్నారు.

ఘనంగా అర్జున్‌ కుమార్తె నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్‌

బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన భగవంత్‌ కేసరి సినిమాలో శ్రీలీల, కాజల్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా ఈ నెల 19న విడుదలైన సంగతి తెలిసిందే. నేటి స‌మాజానికి చాలా అవ‌స‌ర‌మైన గుడ్ ట‌చ్, బ్యాడ్ ట‌చ్ వంటి కీల‌క‌మైన అంశాన్ని చాటి చెప్పిన చిత్రమిది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని