Gorantla Rajendra Prasad: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

ప్రముఖ ఎడిటర్‌ గౌతంరాజు(Gowtham Raju) మరణాన్ని మర్చిపోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో (Tollywood) మరో విషాదం చోటుచేసుకుంది. అలనాటి, ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌...

Updated : 07 Jul 2022 12:18 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఎడిటర్‌ గౌతంరాజు(Gowtham Raju) మరణాన్ని మర్చిపోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో (Tollywood) మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ (86) (Gorantla Rajendraprasad) కన్నుమూశారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజేంద్రప్రసాద్‌ మరణంతో టాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మాధవి పిక్చర్స్‌’ సంస్థను స్థాపించి అపురూప చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’, ‘ఆటగాడు’ వంటి చిత్రాలు ఆ బ్యానర్‌ నుంచి వచ్చినవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని