నాగ్‌ అశ్విన్‌ చేతులమీదుగా మిస్టర్‌ అండ్‌ మిస్‌ ట్రైలర్‌

సినిమా కంటెంట్ బాగుంటే ఎవరూ ఆపలేరని ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. సినిమా అంటే మంచి-చెడు మాత్రమేనని.. చిన్నా పెద్ద సినిమాలు ఉండవని పేర్కొన్నారు. బుల్లితెర వ్యాఖ్యాత శైలేశ్ సన్ని, ‘పెళ్లిచూపులు’ షో ఫేం జ్ఞానేశ్వరీ జంటగా నటించిన సినిమా.....

Published : 29 Feb 2020 22:02 IST

హైదరాబాద్‌: సినిమా కంటెంట్ బాగుంటే ఎవరూ ఆపలేరని ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. సినిమా అంటే మంచి-చెడు మాత్రమేనని.. చిన్నా పెద్ద సినిమాలు ఉండవని పేర్కొన్నారు. బుల్లితెర వ్యాఖ్యాత శైలేశ్ సన్ని, ‘పెళ్లిచూపులు’ షో ఫేం జ్ఞానేశ్వరీ జంటగా నటించిన సినిమా ‘మిస్టర్ అండ్ మిస్’. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. తన స్నేహితుడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా అశోక్ రెడ్డి ఈ చిత్రాన్ని తీశారని ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.

స్నేహితులు అందించిన ఆర్థిక సహకారంతో రొమాంటిక్ లవ్ స్టోరీగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని