పావలా, అర్ధరూపాయి అలా ప్రత్యేకం!

అలనాటి అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయిన

Published : 26 Jul 2021 16:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘ఆదర్శ కుటుంబం’ (1969) విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకటనలు కాస్త విభిన్నంగా తయారు చేశారు. ‘రజతోత్సవం’ అని వేస్తూ ఒక వైపు ‘పావలా బిళ్ల’, మరోవైపు అక్కినేని చిత్రాన్ని ముద్రించారు. ఎందుకంటే పావలాపై 25 అంకె ముద్రించి ఉండటంతో అలా రజతోత్సవాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే స్వర్ణోత్సవ చిత్రంగా ‘బంగారు కుటుంబం’ విడుదల చేశారు. ప్రకటనల్లో ‘స్వర్ణోత్సవం’ అని వేస్తూ అర్ధరూపాయి బిళ్ల వేశారు. 50 పైసలు అని ఉంటుంది కదా. పావలా, అర్ధరూపాయి బిళ్లలు అలా విశేషం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని