సినీనటి శ్రీరెడ్డిపై మరో కేసు

సినీ నటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదైంది. ఫేస్‌బుక్‌ లైవ్‌లో అసభ్య పదజాలంతో తనను తిట్టారని డాన్స్ మాస్టర్

Published : 19 Feb 2020 19:11 IST

హైదరాబాద్‌: సినీ నటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదైంది. ఫేస్‌బుక్‌ లైవ్‌లో అసభ్య పదజాలంతో తనను తిట్టారని డాన్స్ మాస్టర్ రామారావు అలియాస్ రాకేష్ ఫిర్యాదు చేశారు.

‘‘గతంలో శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేసినప్పుడు ఆమెతో ఫోన్‌లో మాట్లాడా. ఆమె పోరాటానికి అండగా ఉంటామని చెప్పాం. అప్పుడు నన్ను ‘రాకేశ్‌గారు’ అని పిలుస్తుంటే, ‘నేను నీకు తండ్రిలాంటివాడిని బాబాయ్‌ అని పిలువమ్మా’ అని చెప్పాను. తనకు జరిగిన అన్యాయం గురించి ‘మా’లో చెబుదామని అన్నాను. అయితే, ఆమె పవన్‌కల్యాణ్‌గారిపైనా, ఇతరుల పైనా ఫేస్‌బుక్‌లో దారుణంగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేశా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా శ్రీరెడ్డితో నాకున్న పరిచయం గురించి ఇదే విషయాన్ని చెప్పా. అయితే, ఆమె దాన్ని సరిగా అర్ధం చేసుకోకుండా.. ఫేస్‌బుక్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశా’’ అని రాకేశ్‌ చెప్పుకొచ్చారు. రాకేష్ ఫిర్యాదుపై శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని