సినిమా చూసి అడ్వాన్స్‌ ఇచ్చిన నిర్మాత

ఓ విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కి.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ ప్రేమకథా చిత్రంలో రక్షిత్‌, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించగా రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. మార్చి 6న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో..

Updated : 05 Mar 2020 15:33 IST

తన బ్యానర్‌లో ఓ సినిమా..

హైదరాబాద్‌: ఓ విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కి.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ ప్రేమకథా చిత్రంలో రక్షిత్‌, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించగా రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. మార్చి 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ‘పలాస 1978’ వీక్షించిన అల్లు అరవింద్‌.. చిత్ర దర్శకుడు కరుణకుమార్‌ను ప్రశంసించారు. 

‘పలాస 1978’ చిత్రం తనకు ఎంతగానో నచ్చడంతో దర్శకుడు కరుణకుమార్‌తో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అల్లు అరవింద్‌.. అడ్వాన్స్‌ చెక్‌ను కరుణకుమార్‌కు అందించారు. ఈ మేరకు కరుణకుమార్‌ గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను పలువురు సినీవిశ్లేషకులు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని