రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్‌ పూర్తి చేసిన కీరవాణి

అగ్ర దర్శకుడు రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను తారక్‌, రామ్‌చరణ్‌ ఇప్పటికే పూర్తి చేయగా, తాజాగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా ఈ

Updated : 23 Apr 2020 05:31 IST

హైదరాబాద్‌: అగ్ర దర్శకుడు రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను తారక్‌, రామ్‌చరణ్‌ ఇప్పటికే పూర్తి చేయగా, తాజాగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఉతికిన బట్టలు ఆరేస్తూ, తువాళ్లను మడత పెడుతూ కీరవాణి వీడియోలో కనిపించారు. దీంతో పాటు మొక్కలకు నీళ్లు పోసి, డైనింగ్‌ టేబుల్‌ తుడిచారు. ఈ పనులన్నింటికీ బ్యాగ్రౌండ్‌లో ‘సై’లో తాను కంపోజ్‌ చేసిన ‘అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఇలాగా’ అనే పాటను జోడించారు.

‘‘ఈ ఛాలెంజ్‌ కరోనా వైరస్‌లా పాకుతోంది. సందీప్‌ వంగా నుంచి రాజమౌళి వరకూ నాతో పాటు, ఇతరులు కూడా ఈ ఛాలెంజ్‌ స్వీకరిస్తున్నారు. నేను నా పని పూర్తి చేశాను. దర్శకుడు క్రిష్‌, సంగీత దర్శకుడు తమన్‌ను నామినేట్‌ చేస్తున్నా’’ ట్విటర్‌లో కీరవాణి

ప్రస్తుతం కీరవాణి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు. స్కైప్‌, జూమ్‌ టూల్‌ వంటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు రాజమౌళితో పాటు, ఇతర బృందానితో చర్చలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు.

ఇవీ చదవండి..

కత్తి పట్టిన చేత్తోనే.. చీపురు పట్టిన ఎన్టీఆర్‌

ఇంటి పని, వంట పని చేసిన ‘మగధీరుడు’

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని