వెండితెరపైనే కాదు లాక్డౌన్లోనూ వీళ్లు స్టార్సే..!
భారీ సెట్స్, సుందరమైన లోకేషన్స్లో ష్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అంటూ డైరెక్టర్ ఇచ్చే కమాండ్స్కు అనుగుణంగా పాత్రలోకి ఒదిగిపోయి నటీనటులు మెప్పిస్తుంటారు. అలా ఎంతోమంది వెండితెర, బుల్లితెర ..
వీడియోలతో సెలబ్రిటీలు.. వ్యూస్తో నెటిజన్లు సందడి
ఇంటర్నెట్డెస్క్: భారీ సెట్స్, సుందరమైన లోకేషన్స్లో స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అంటూ డైరెక్టర్ ఇచ్చే కమాండ్స్కు అనుగుణంగా పాత్రలోకి ఒదిగిపోయి నటీనటులు మెప్పిస్తుంటారు. అలా ఎంతోమంది వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే అనుకోని విధంగా ఈ ఏడాది పరిస్థితులు తారుమారయ్యాయి. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్కు బ్రేక్ పడింది. దీంతో సినీ, టీవీ ఆర్టిస్ట్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నప్పటికీ పలువురు సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు రూపొందించి ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరించారు. ‘స్టే హోమ్ స్టే సేఫ్’ అనే నినాదంతో కొంతమంది తారలు షార్ట్ ఫిల్మ్స్తో మెప్పిస్తే.. మరికొంతమంది ఫన్నీ వీడియోలతో ఆకట్టుకున్నారు. అలా వీడియోలతో సెలబ్రిటీలు.. వ్యూస్తో నెటిజన్లు నెట్టింట్లో తెగ సందడి చేశారు. లాక్డౌన్లో నెట్టింట్లో మెప్పించిన సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి..
మేమంతా ఒకే ‘ఫ్యామిలీ’
భారత చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటులుగా పేరు పొందిన అమితాబ్, మోహన్లాల్, మమ్ముట్టి, చిరంజీవి కలిసి నటించిన షార్ట్ఫిల్మ్ ‘ఫ్యామిలీ’. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజువారీ కార్మికుల కోసం ఫండ్రైజ్ చేసేందుకు దీనిని రూపొందించారు. ప్రాంతం ఏదైనా సరే సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అని మరోసారి ఈ లఘు చిత్రంతో నిరూపించారు. ఈ వీడియోని 24 లక్షల మంది వీక్షించారు.
‘స్టే హోమ్’లో 34 మంది
బుల్లితెర ప్రేక్షకులను ధారావాహికలతో మెప్పించే తారలందరూ ‘స్టే హోమ్’ అన్నారు. అలా 32 మంది బుల్లితెర తారలు ‘స్టే హోమ్’ షార్ట్ఫిల్మ్తో ప్రేక్షకులకు మంచి మెస్సేజ్ ఇచ్చారు. వీరి కష్టానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తోడయ్యారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ‘పుట్టడానికి తొమ్మిది నెలలు ఓపిక పట్టావ్.. బతకడానికి కొన్నిరోజులు ఓపిక పట్టలేవా’ అంటూ ఎస్పీబీ ఆలోచింపజేశారు.
‘ఏమాయ చేసావె’ మేజిక్ రీక్రియేట్
ఎవర్గ్రీన్ లవ్స్టోరీగా గౌతమ్ మేనన్ తెరకెక్కించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. ‘విన్నైతాండి వరువాయ’ పేరుతో తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రంలో శింబు, త్రిష జంటగా మెప్పించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఏవిధంగా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల గౌతమ్ మేనన్ రూపొందించిన లఘుచిత్రం ‘కార్తీక్ డయల్ సేతా యెన్’. ఇందులో త్రిష, శింబు నటన చూసి ప్రేక్షకులు వావ్ అన్నారు. అలా ఈ షార్ట్ఫిల్మ్ 68 లక్షల వ్యూస్తో దూసుకెళ్తోంది.
‘రైటర్’గా పాయల్
‘ఆర్ఎక్స్100’ చిత్రంతో మెప్పించిన పాయల్ రాజ్పుత్ తాజాగా నటించిన షార్ట్ఫిల్మ్ ‘ఏ రైటర్’. 24 గంటల్లోనే రూపొందించిన ఈ ఫిల్మ్ను పాయల్ బాయ్ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా డైరెక్ట్ చేశారు. గృహహింసను ప్రధానంగా చూపిస్తూ తెరకెక్కిన ఈ వీడియోను క్వారంటైన్ స్పెషల్ అని పేర్కొంటూ విడుదల చేశారు. దాదాపు 48 వేల మంది వీక్షించారు.
సుమక్క ‘సూపర్ 4’
బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు యాంకర్ సుమ. లాక్డౌన్ కారణంగా కుటుంబపోషణ విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు ఆమె ఇటీవల పలు ఫన్నీ గేమ్ షోలను నిర్వహించారు. బుల్లితెర యాంకర్స్ రవి, అనసూయ, ప్రదీప్, రష్మీలతో ఆమె చేసిన ‘సూపర్ 4’, శ్రీముఖి, అవినాష్తో రూపొందించిన ‘సూపర్ 2’ నెటిజన్లను ఎంతగానో మెప్పించాయి. ‘సూపర్ 4’ వీడియోకి వచ్చిన మొత్తాన్ని సాయం కోరేవారికి ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ వీడియోను ఇప్పటివరకూ 6 లక్షల మంది చూశారు.
శ్రీముఖి ఫుల్ ఎంటర్టైన్మెంట్
బుల్లితెర రాములమ్మగా పేరుపొందిన యాంకర్ శ్రీముఖి లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ బోర్ఫీల్ అవుతున్న ప్రేక్షకుల కోసం పలు వీడియోలను రూపొందించారు. అవినాష్, విష్ణుప్రియతో ఆమె రూపొందించిన ‘బతుకు బలైపోయిన బండి’ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకూ 13 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. దీనితోపాటు ‘మీలో ఎవరికి బోర్ కొడుతుంది?’, ‘ఒక్కఛాన్స్’ వీడియోలతో ఆమె మెప్పించారు.
రవి ‘దాగుడుమూతలు’
షూటింగ్స్ నుంచి ఖాళీ దొరకడంతో యాంకర్ రవి ఇంట్లో సరదాగా గడుపుతున్నారు. తన కుమార్తె వియాతో కలిసి ‘హైడ్ అండ్ సీక్’ ఆడారు. ఈ ఆటలో అనసూయ, రాహుల్ సిప్లింగజ్, అలీ రెజా కూడా భాగమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రవి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి రూపొందించారు. ‘స్టే హోమ్ స్టే సేఫ్’ నినాదంతో అలరించిన ఈ వీడియోను ఇప్పటివరకూ 6లక్షల మంది వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?