జోనర్‌ చెప్పు.. స్పెషల్‌ గిఫ్ట్‌ పట్టు..!

తాను దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా ఏ జోనర్‌లోకి వస్తుందో కనిపెట్టి చెప్పి స్పెషల్‌ గిఫ్ట్స్‌ సొంతం చేసుకోమని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అన్నారు. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన మొదటి...

Published : 30 May 2020 14:22 IST

ట్వీట్‌ చేసిన దర్శకుడు

హైదరాబాద్‌: తాను దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా ఏ జోనర్‌లోకి వస్తుందో కనిపెట్టి చెప్పి స్పెషల్‌ గిఫ్ట్స్‌ సొంతం చేసుకోవాలని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కోరారు. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా ప్రీలుక్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. మోషన్‌ పోస్టర్‌ చాలా విభిన్నంగా ఉందంటూ నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు కామెంట్లు పెట్టారు.

‘నా తదుపరి సినిమాకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను మీరు చూశారా? అయితే అది ఏ జోనర్‌లోకి వస్తుందో కనిపెట్టండి. #PV3 అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీ సమాధానాలను వెల్లడించండి. సర్‌ప్రైజ్‌ బహుమతులను అందుకోండి క్లూ: తెలుగులో మొదటి చిత్రం’ అని ప్రశాంత్‌ పేర్కొన్నారు. ప్రశాంత్‌ పెట్టిన ట్వీట్‌ చూసిన నెటిజన్లు.. ‘జోంబీ జోనర్‌’ అని పేర్కొంటూ రిప్లైలు ఇస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని