Gopichand: నా పాకెట్ మనీ రూ. 1.. ఆ విషయంలో రాజీ పడను: గోపీచంద్
ఆయన విలన్ పాత్ర పోషించిన సినిమా వి‘జయం’ అందుకోవాల్సిందే. బాక్సాఫీసు వద్ద వసూళ్ల ‘వర్షం’ కురవాల్సిందే. యాక్షన్కు ఆయన ‘రారాజు’. అదొక్కటే ఆయన ‘లక్ష్యం’ కాదు.
ఇంటర్నెట్ డెస్క్: ఆయన విలన్ పాత్ర పోషించిన సినిమా విజయం అందుకోవాల్సిందే. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురవాల్సిందే. యాక్షన్కు ఆయన రారాజు. అదొక్కటే ఆయన లక్ష్యం కాదు. యాక్షన్తోపాటు కామెడీని పండించి ప్రేక్షకులతో సీటీమార్ కొట్టించారు. రణం, లౌక్యం లాంటి పూర్తిస్థాయి యాక్షన్- ఎంటర్టైనర్ తర్వాత ‘పక్కా కమర్షియల్’(pakka commercial)తో మరికొన్ని రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నారు. ఆ స్టార్ ఎవరో కాదు గోపీచంద్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం జులై 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో గోపీచంద్(Gopichand) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ విశేషాలివీ..
* మీ గత సినిమాలతో పోలిస్తే ‘పక్కా కమర్షియల్’లో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు?
గోపీచంద్: పక్కా స్టైల్గా కనిపించాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. కాస్ట్యూమ్స్ వల్ల అంత స్టైలిష్గా కనిపిస్తున్నానేమో! వేషధారణలో మార్పులు వచ్చాయేమోగానీ నా ఫిట్నెస్ విషయంలో మార్పులేదు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ కరమ్ చావ్లా నన్ను బాగా చూపించారు. నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ ఆయనదే.
* మారుతితో సినిమా అనగానే మీకేమనిపించింది?
గోపీచంద్: ఈ సినిమా ఖరారుకాక ముందు మారుతి నాకు అంతగా పరిచయం లేదు. నిర్మాత వంశీ ఓసారి నన్ను కలిసి, మారుతితో సినిమా చేద్దామనుకుంటున్నా నువ్వు చేస్తావా అని అడిగారు. మారుతి ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీశారు.. యాక్షన్ కూడా కలిపితే మనకి ప్లస్ అవుతుంది కదా అని బదులిచ్చా. ఓకే అని చెప్పి, ఆయన కథ వినమన్నారు. కొన్ని రోజులకు మారుతి వచ్చి స్క్రిప్టు వివరించారు. అది పూర్తయ్యాక, ఈ సినిమాకి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పెడుతున్నట్టు చెప్పారు. కథకు తగ్గ పేరు అని అప్పుడే ఫిక్స్ అయ్యా.
* కథ విన్నాక మీరేమైనా సలహాలు ఇచ్చారా?
గోపీచంద్: ఆ అవకాశం మారుతి ఇవ్వలేదు. అంత అద్భుతంగా కథను రాసుకున్నాడు.
* మీ పాత్ర గురించి వివరిస్తారా?
గోపీచంద్: సాధారణంగా ప్రతి ఒక్కరూ కమర్షియల్గానే ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులోని కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దారు. నేనిందులో లాయరుగా కనిపిస్తా. ఈ క్యారెక్టర్ కమర్షియల్గానే కాదు ఎమోషనల్గానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.
* వ్యక్తిగతంగా మీరు కమర్షియలా?
గోపీచంద్: కమర్షియల్ అంటే డబ్బు అని అందరికీ తెలిసిందే. పరిస్థితులను బట్టి కొందరు డబ్బే ప్రధానంగా బతికితే మరికొందరు అవసరం మేరకు సంపాదిస్తుంటారు. నా విషయానికొస్తే.. నా పనికి తగ్గ మొత్తాన్ని ముందుగానే నిర్ణయించుకుంటా. దానికంటే ఎక్కువ తీసుకోను, తక్కువా తీసుకోను. ఈ విషయంలో నేను రాజీపడను. ఎందుకంటే నేను ఎవరికైనా సాయం చేయాలంటే ముందు నా దగ్గర మనీ ఉండాలి కదా. అది మినహా, ఇతర విషయాల్లో నేను కమర్షియల్ కాదు.
* మారుతి సినిమాల్లో కథానాయకుడి పాత్ర ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ఇందులోనూ అంతేనా?
గోపీచంద్: అవును. కథానాయకుడి కోణంలోనే ఈ కథ నడుస్తుంది. దానికి తగ్గట్టే మారుతి సంభాషణలు రాశారు. ఆయన చాలా స్పీడ్. ఆయన్ను అర్థం చేసుకోవడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది.
* మీ అభిమానులతో మాట్లాడుతుంటారా?
గోపీచంద్: నేను సోషల్ మీడియాలో అంత చురుకుగా ఉండను. సినిమాలకు సంబంధించిన అప్డేట్లు తప్ప వ్యక్తిగత విశేషాలు పంచుకోను. కానీ, మెసేజ్ల ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తుంటా.
* మీ తొలి పాకెట్ మనీ ఎంత?
గోపీచంద్: రూ. 1, రూ. 2 (పాఠశాల రోజుల్లో). అప్పుడు అవే ఎక్కువ (నవ్వుతూ..)
* మీ తొలి సంపాదన?
గోపీచంద్: రూ. 11,000. ‘జయం’ సినిమాకు తీసుకున్న తొలి పారితోషికమది. ఆ చిత్ర దర్శకుడు తేజ లక్కీ నంబరు 11.
* మీరు ఏ సినిమాకు అత్యధిక పారితోషకం తీసుకున్నారు?
గోపీచంద్: పక్కా కమర్షియల్. విజయాన్ని బట్టి పారితోషికం పెరుగుతుంటుంది కదా.
* పక్కా కమర్షియల్ చిత్ర బృంద సభ్యులను ఏ కరెన్సీతో పోలుస్తారు?
* మారుతి: ఇండియన్ కరెన్సీ
* రాశీఖన్నా: ఫారిన్ కరెన్సీ (యూఎస్ డాలర్స్)
* బన్నీవాసు: పౌండ్లు
* అరవింద్: దిర్హామ్
* వంశీ: ఏదీ కాదు. ఎందుకంటే ఆయన డబ్బు గురించి పెద్దగా ఆలోచించరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.