Sonam Kapoor: ‘వాళ్లు ఈ విషయాన్ని గ్రహించాలి’.. సోనమ్‌ ఇన్‌స్టా పోస్ట్‌ ఎవరిని ఉద్దేశించి..?

నటి సోనమ్‌కపూర్‌ (Sonam Kapoor) తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు

Published : 16 Aug 2023 16:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్ (Sonam Kapoor) తాజాగా షేర్‌ చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మనిషి మనస్తత్వాన్ని ఉద్దేశిస్తూ ఎలియనోర్ రూజ్‌వెల్ట్ అనే సామాజిక వేత్త చెప్పిన సందేశాన్ని సోనమ్‌ ఇప్పుడు షేర్‌ చేయడానికి గల కారణమేమిటా? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ఏమిటంటే..?

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు నటి సోనమ్‌కపూర్‌. తన లైఫ్‌ స్టైల్‌కు సంబంధించిన విశేషాలను ఆమె తరచూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె.. ఎలియనోర్ రూజ్‌వెల్ట్‌ సందేశాన్ని షేర్‌ చేశారు. ‘‘సంకుచిత మనస్తత్వం కలిగినవారు ఎదుటివ్యక్తుల గురించి మాట్లాడతారు. ఓ మాదిరిగా ఆలోచించేవారు పరిస్థితుల గురించి మాట్లాడతారు. గొప్ప మనసు కలిగినవారు ఆలోచనల గురించి చర్చిస్తుంటారు’’ అనే సందేశాన్ని షేర్‌ చేసిన ఆమె.. ‘‘చిన్న విషయమే అయినప్పటికీ కొంతమంది దీనిని గ్రహించాలనుకుంటున్నా. ముఖ్యంగా, ఎదుటివారిపై వచ్చిన వదంతుల గురించి మాట్లాడేటప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు. దీనిని చూసిన నెటిజన్లు.. సోనమ్‌ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? అని చర్చించుకుంటున్నారు.

Samantha: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: సమంత ఆసక్తికర పోస్ట్‌

ఇక, ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రానా.. సోనమ్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో దుల్కర్‌ హీరోగా నటించిన ఓ ప్రాజెక్ట్‌ షూట్‌లో తాను పాల్గొన్నానని, అక్కడ ఓ బీటౌన్‌ స్టార్‌ హీరోయిన్‌ షూట్‌ మధ్యలో తన భర్తతో ఫోన్‌లో షాపింగ్‌ గురించి మాట్లాడిందని.. డైలాగ్స్‌ కూడా సరిగ్గా చెప్పలేదన్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న దుల్కర్‌, మరోసారి సీన్స్‌లో యాక్ట్‌ చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారి తీయగా నటీనటులకు రానా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో సోనమ్‌ కపూర్‌ ఇలాంటి పోస్టులు పెట్టడం వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని