AlluArjun: చిరంజీవి సమక్షంలో అల్లు అర్జున్‌కు సన్మానం.. వైరల్‌గా మారిన ఫొటోలు

‘పుష్ప’తో బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ బన్నీ విజయకేతనం ఎగురవేశారు..

Published : 21 Mar 2022 12:37 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’తో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ బన్నీ విజయకేతనం ఎగురవేశారు. బాలీవుడ్‌లో ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కాగా, అల్లు అర్జున్‌ సాధించిన విజయం పట్ల ఆయన మావయ్య (స్నేహారెడ్డి తండ్రి) కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బన్నీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో దర్శకులు హరీశ్‌ శంకర్‌, సుకుమార్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, గుణశేఖర్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక, ‘పుష్ప’ విషయానికి వస్తే సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఇది తెరకెక్కింది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని