Kangana Ranaut: వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల దాదాపు రూ.40కోట్లు పోయాయి: కంగనా
Kangana Ranaut: తన వ్యాఖ్యలు, అభిప్రాయాల వల్ల వివిధ ప్రకటనలను చేసే అవకాశాన్ని కోల్పోయినట్లు సినీ నటి కంగనా రనౌత్ అన్నారు.
ఇంటర్నెట్డెస్క్: తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). తన సహజ వ్యక్తిత్వం, వ్యాఖ్యల వల్ల దాదాపు రూ.30 నుంచి 40 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులు, దేశ వ్యతిరేక శక్తులపై వ్యతిరేక స్వరాన్ని వినిపించడం వల్ల ప్రకటనల్లో నటించే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో 20-25 ప్రకటనలు తాను కోల్పోయినట్లు తెలిపారు. ‘నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అదే చెబుతాను. ఒకవేళ దాని వల్ల డబ్బు కోల్పోతే అలాగే జరగనీయండి’ అంటూ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇన్స్టా వేదిక కంగన పోస్ట్ పెట్టారు.
‘‘ఇదే నిజమైన వ్యక్తిత్వం. నిజమైన స్వేచ్ఛ, విజయం. హిందూయిజం గురించి అనుకూలంగా మాట్లాడటం, కొందరు రాజకీయ నాయకులను విమర్శించటం, దేశవ్యతిరేక శక్తులపై గళమెత్తడం వల్ల 20-25 ప్రకటనల్లో నటించే అవకాశాన్ని నేను కోల్పోయా. రాత్రికి రాత్రే కొందరు ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. వీటి ద్వారా ఏడాదికి రూ.30-40 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛ జీవిని. నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఎవరూ ఆపలేరు. అలాగని పనిగట్టుకుని ఒక అజెండా పెట్టుకుని మాట్లాడతానని కాదు. భారతదేశ సంస్కృతి, సమగ్రతను వ్యతిరేకించే బహుళజాతి సంస్థల అధినేతలపై కచ్చితంగా మాట్లాడతా. ఈ విషయంలో ఎలన్ మస్క్ను అభినందించకుండా ఉండలేను. ప్రతి ఒక్కరూ తమ బలహీనతలను ప్రదర్శిస్తారు. కనీసం ధనవంతులైనా డబ్బు గురించి ఆలోచించకూడదు’’ అని కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు.
2020 జులైలో కంగనా రనౌత్ ట్వీట్ చేస్తూ మహారాష్ట్రలో పరిస్థితి పాక్ ఆక్రమిత కశ్మీర్లా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జేఎన్యూ విద్యార్థులకు మద్దతుగా దీపిక పదుకొణె నిలవడంపైనా కంగనా విమర్శలు గుప్పించారు. ‘తుక్డే గ్యాంగ్’కు మద్దతు తెలిపారంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా ట్విటర్ ఖాతాను ఆ సంస్థ నిలిపివేసింది. ఇటీవలే మళ్లీ పునరుద్ధరించింది. ప్రస్తుతం కంగనా ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రంలో నటిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో ఆమె కనిపించనున్నారు. అనుపమ్ఖేర్, సతీష్ కౌశిక్, మిలింద్ సోమన్ కీలక పాత్రధారులు. ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కంగనా రనౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు
-
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?
-
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
-
బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఎనిమిది మంది మృతి!
-
నా ప్రేమ, మద్దతు పవన్కల్యాణ్కే.. అల్లు అర్జున్ పోస్ట్
-
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ