Kriti Sanon: ఆ సినిమా కోసం రోజుకు 17 గంటలు పనిచేశా: కృతి సనన్‌

బాలీవుడ్ నటి కృతి సనన్ నిర్మాతగా రోజుకు 17 గంటలు పనిచేశానని తెలిపారు.

Updated : 17 Mar 2024 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ (Kriti Sanon) నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘దో పత్తీ’(Do Patti,). ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై ఆమె నిర్మించిన మొదటి చిత్రం ఇది. ‘‘నిర్మాతగా నా మొదటి సినిమా కోసం రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేశాను. ఏ సన్నివేశం అయినా అనుకున్న విధంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుని నిర్మించాను. స్క్రిప్ట్‌, పాత్రలు, సంగీతం అన్ని విభాగాల్లోనూ భాగం అయ్యాను. సినిమా బడ్జెట్‌ గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. నటిగా, నిర్మాతగా రాణించగలనని నమ్ముతున్నాను’’ అని కృతి ఓ టెలివిజన్‌ షోలో అన్నారు.

కృతి మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కరీనా కపూర్‌, టబుతో కలిసి నటించిన ‘క్రూ’ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకే చోట పని చేసే ముగ్గురు మహిళల జీవితాన్ని విధి ఏవిధంగా మలుపుతిప్పిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని