lakshyam 2: ‘లక్ష్యం2’ షూటింగ్‌లో పడిపోయిన గోపీచంద్‌

కథానాయకుడు గోపీచంద్‌.. దర్శకుడు శ్రీవాస్‌ కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయాల తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న మూడో చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డింపుల్‌ హయాతి కథానాయిక.

Published : 30 Apr 2022 12:28 IST

కథానాయకుడు గోపీచంద్‌.. దర్శకుడు శ్రీవాస్‌ కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయాల తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న మూడో చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డింపుల్‌ హయాతి కథానాయిక. ప్రస్తుతం మైసూర్‌లో మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా గోపీచంద్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అలాగే ఓ పాట చిత్రీకరించనున్నారు. మే తొలి వారంలో ఈ షెడ్యూల్‌ పూర్తికానుంది. ‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం మిళితమైన బలమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక్కడ చిత్రీకరణలో గోపీచంద్‌ కాలుజారి పడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.’’ అని చిత్ర వర్గాలు తెలియజేశాయి. ఈ సినిమాకి ‘లక్ష్యం2’ అనే టైటిల్‌ ఖరారు చేస్తున్నారు.సంగీతం: మిక్కీ జే మేయర్‌, ఛాయాగ్రహణం: వెట్రి పళని స్వామి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని