Madhavan: ఆ చిత్రంలో నేను నటించడం లేదు

 ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో  పవన్‌ కుమార్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ యాక్షన్‌ మూవీలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు

Updated : 12 Jun 2021 17:33 IST

రామ్‌-లింగుస్వామి సినిమాపై క్లారిటీ ఇచ్చిన తమిళ నటుడు

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్‌, కృతిశెట్టి హీరో-హీరోయిన్లుగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఇందులో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం.. రెండు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చనున్నారు. గతకొన్ని రోజులుగా తమిళ నటుడు మాధవన్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టగా... వాటిని ఖండిస్తూ శనివారం నటుడు మాధవన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘దర్శకుడు లింగుస్వామితో పనిచేయడాన్ని నేను ప్రేమిస్తాను.. ఎందుకంటే ఆయనొక చక్కటి వ్యక్తి. కానీ, ఇటీవల తెలుగులో నేను విలన్‌గా నటస్తున్నట్టు వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు’’ అంటూ స్పష్టం చేశారు. కాగా మాధవన్‌ గతంలో లింగుస్వామి దర్శకత్వంలో ‘వెట్టాయి’ చిత్రంలో నటించారు. మరోవైపు ‘బ్రూస్‌లీ’లో తెలుగు ప్రేక్షకులను అలరించిన మరో నటుడు అరుణ్‌ విజయ్‌ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ నటుడు ఏమంటారో వేచి చూడాలి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్‌ నేరుగా నటించిన తెలుగు చిత్రం ‘సవ్యసాచి’. అందులో హీరోగా నాగచైతన్య నటించగా మాధవన్‌ ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని