గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన మీనా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ దేవి నాగవల్లి నామినేట్‌ చేయడంతో సోమవారం చెన్నై సైదాపేట్‌లోని తన నివాసంలో ప్రముఖ నటి మీనా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ

Published : 18 Jan 2021 16:12 IST

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ దేవి నాగవల్లి నామినేట్‌ చేయడంతో సోమవారం చెన్నై సైదాపేట్‌లోని తన నివాసంలో ప్రముఖ నటి మీనా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనమందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆమె అన్నారు . ఈ ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని ఆమె కోరుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ కన్నడ హీరో సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్‌లను ఈ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి

నా పెళ్లికి అవే వేదికలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని