మేమిద్దరం కలిసే ఆడిషన్స్కు వెళ్లాం: నవీన్ పొలిశెట్టి
ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో తాను నటించాలనుకుంటున్నట్లు కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తెలిపారు. యూట్యూబ్ స్టార్గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నవీన్...
హైదరాబాద్: ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో తాను నటించాలనుకుంటున్నట్లు కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తెలిపారు. యూట్యూబ్ స్టార్గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నవీన్ ‘ఢి ఫర్ దోపిడి’, ‘1 నేనొక్కడినే’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో కథానాయకుడిగా మారిన నవీన్ ఇటీవల ‘జాతిరత్నాలు’తో రెండో సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు.
‘‘నటుడిగా మారాలనుకున్నప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్లో పనిచేశా. వాళ్ల వీడియోలకు రచయితగా, నటుడిగా వర్క్ చేశా. పెళ్లి గురించి మేము చేసిన ఓ కామెడీ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని ఇష్టపడతారని అర్థమైంది. సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కునే బదులు మన క్రియేటివిటి ఇక్కడే ఉపయోగించవచ్చు కదా అనిపించింది. వెంటనే వరుస వీడియోలు చేశాం. అన్ని హిట్ అయ్యాయి. దాంతో నాకు కొన్ని సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. చిన్న పాత్రలు అయినప్పటికీ నటించాను. అలాంటి సమయంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ కథ నా వద్దకు వచ్చింది. వెంటనే ఓకే చేసేశాను’’
‘‘నా దృష్టిలో నటుడంటే అన్ని రకాల జోనర్లలో నటించగలగాలి. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి 200శాతం కృషి చేస్తా. బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ అవ్వాలని అనుకుంటాం. అలాగే, ఆ సినిమా గురించి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరూ చెప్పుకోవాలి. అలాంటి సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తా. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా’’
‘‘విజయ్ దేవరకొండ, నేనూ కెరీర్ను ఒకేసారి ప్రారంభించాం. మేమిద్దరం కలిసి ఆడిషన్స్ కూడా వెళ్లేవాళ్లం. కష్టపడితే తప్పకుండా మన కలలను సాకారం చేసుకోవచ్చు అనే దానికి మా ఇద్దరి ప్రయాణమే ఓ నిర్వచనం’’ అని నవీన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు.