Rashmi: నా మీద చేతబడి చేయిస్తానంటున్నారు.. ఫిర్యాదు చేయమంటారా: యాంకర్‌ రష్మి

యాంకర్‌ రష్మి (Anchor Rashmi)ను ఓ నెటిజన్‌ తీవ్రంగా బెదిరించాడు. ఆ మెసేజ్‌ స్క్రీన్‌షాట్‌ను ఆమె షేర్‌ చేసింది. ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయాలా అంటూ పోస్ట్‌ పెట్టింది.

Updated : 26 Feb 2023 18:37 IST

హైదరాబాద్‌: తెలుగువాళ్లకి పరిచయం అవసరం లేని పేరు రష్మి (Anchor Rashmi). ఒకవైపు యాంకర్‌గానూ మరోవైపు నటిగానూ ఆమె ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ ఆసక్తికర అంశాలపై స్పందిస్తుంటుంది. అలాగే తనని విమర్శిస్తూ సెటైర్లు, కౌంటర్లు వేసే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటుంది. తాజాగా రష్మిని ఓ నెటిజన్‌ తీవ్రంగా బెదిరించాడు. ఆ స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేసిన ఆమె (rashmi gautam) దీనిపై ఫిర్యాదు చేయాలా.. ? అని నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్ట్‌ పెట్టింది.

విషయమేమిటంటే.. తాజాగా హైదరాబాద్‌లో కుక్కల దాడికి ఓ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. కొందరు ఆమెను బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ పంపిన బెదిరింపు సందేశం స్క్రీన్‌ షాట్‌ను రష్మి పోస్ట్‌ చేసింది. ‘‘ నీ మీద చేతబడి చేయిస్తా. నువ్వు రోడ్డు మీద తిరగకు. ఇంట్లోనే ఉండు. నీ మీద యాసిడ్‌ పోస్తా. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’’ అంటూ అందులో బెదిరింపులు ఉన్నాయి. 

 ‘‘ఈ నెటిజన్‌కు గతంలో నా వయసు, పెళ్లి గురించి సమస్య ఉంది. ఇప్పుడు ఏకంగా నాకు చేతబడి చేసి.. యాసిడ్‌ పోయాలనుకుంటున్నాడు. నేనిప్పుడు ఫిర్యాదు చేయాలా..’’ అని రష్మి ప్రశ్నించింది. ప్రస్తుతం రష్మిపోస్ట్‌ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతు ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని