లేడీ విజయసేతుపతిలా ఉండాలనుకుంటున్నా!
‘మెంటల్ మదిలో’ అంటూ తన అందం, నటనతో ఆకట్టుకుని, తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నటి నివేతా పేతురాజు. గతేడాది
‘మెంటల్ మదిలో’ అంటూ తన అందం, నటనతో ఆకట్టుకుని, తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నటి నివేతా పేతురాజ్. గతేడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అలరించిన నివేతా త్వరలో రామ్ ‘రెడ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె విలేకరులతో ముచ్చటించింది.
సంక్రాంతికి వస్తున్న మీ ‘రెడ్’ చిత్రం గురించి?
నివేతా పేతురాజ్: సంక్రాంతి పండగ మనమంతా చాలా బాగా జరుపుకొంటాం. అందులోనూ కరోనాతో ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మొదట మా చిత్రం గతేడాది డిసెంబరు 25న విడుదలవుతుందన్నారు. కానీ, సంక్రాంతికి వస్తుండడంతో మరింత సంతోషంగా ఉంది.
రెడ్తో మీ జర్నీ ఎలా ఉంది?
నివేతా పేతురాజ్: డైరెక్టర్ కిషోర్ తిరుమలతో అంతకుముందు ‘చిత్రలహరి’కి పనిచేశాను. తమిళ్ మూవీ ‘తడమ్’రీమేక్ చేయనున్నట్టు ఆయన చెప్పగానే నేను ఓకే చెప్పేశాను. ఒక కొత్త ఫీలింగ్ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు నేను ‘తడమ్’ సినిమా చూడలేదు. కేవలం కొన్ని సీన్లు మాత్రమే రీమేక్ కోసం చూడాల్సి వచ్చింది.
పోలీస్ పాత్రకు ఎలా సిద్ధమయ్యారు?
నివేతా పేతురాజ్: దర్శకులు కిషోర్ తిరుమలనే ఆ పోలీస్ పాత్రకు తగ్గట్టు నన్ను సిద్ధం చేశారు. ఆయనతో ఉన్న సౌలభ్యం అదే. ఆయనకు స్క్రిప్ట్పై పూర్తి అవగాహన ఉంటుంది. నటుల నుంచి కావల్సిన నటనను ఆయన రప్పించుకుంటారు.
మీ పాత్ర ‘రెడ్’లో ఎలా ఉండబోతోంది?
నివేతా పేతురాజ్: అంతకు ముందు మా కాంబినేషన్లో చేసిన ‘చిత్రలహరి’లో నా పాత్ర కొంచెం మూడీగా ఉంటుంది. కానీ, ఇందులో కొంచెం అమాయకత్వంతో కూడిన పోలీస్ పాత్ర నాది. బయటకు ధైర్యంగా కనిపించినా, లోపల మాత్రం భయంగా నా క్యారెక్టర్ ప్రవర్తిస్తుంది.
రెండోసారి కిషోర్ తిరుమలతో పనిచేయడం ఎలా ఉంది?
నివేతా పేతురాజ్: కిషోర్ సార్తో చేసినపుడు నేను స్క్రిప్ట్ కూడా మొత్తం వినను. అంత నమ్మకం ఆయనంటే. అలాగే ‘బ్రోచేవారెవరురా’ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ కథ చెప్పినా నేను మొత్తం వినను. వెంటనే ఓకే చెప్పేస్తాను. వాళ్లిద్దరిపై నాకు పూర్తి నమ్మకం ఉంది.
రామ్ సెట్లో ఎలా ఉంటారు?
నివేతా పేతురాజ్: ఆయనతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. మంచి హాస్యచతురత కలిగిన వ్యక్తి. తమిళ్ కూడా బాగా మాట్లాడతారు.
మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారా?
నివేతా పేతురాజ్: అవును. ఇప్పుడే తెలుగు బాగా వస్తోంది. అలవైకుంఠపురంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ, ఈ చిత్రంలోనే ఫుల్లెంగ్త్లో డబ్బింగ్ చెప్పాను. కొంచెం కష్టంగా అనిపించినప్పటికి ఎంజాయ్ చేశాను.
సెకండ్ హీరోయిన్ పాత్రలే వేస్తున్నారు?
నివేతా పేతురాజ్: అలా ఏం కాదు. పాత్ర ప్రాముఖ్యతను బట్టి అవి ఎంచుకుంటున్నాను. ‘అల వైకుంఠపురంలో’ నా పాత్ర ప్రాధాన్యం అంతగా లేకపోయినప్పటికి, ఆ చిత్రం అందరికీ రీచ్ అవ్వడం నాకు ప్లస్ అయ్యింది.
ఇంకా రాబోతున్న మీ చిత్రాలు?
నివేతా పేతురాజ్: ‘పాగల్’, ‘విరాటపర్వం’తో పాటు చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మరో 3 రోజుల షూటింగ్ ఉంది. కార్తికేయ-2 చిత్రానికి కూడా నన్ను సంప్రదించారు. ఇంకా స్క్రిప్ట్ వినలేదు. గ్లామర్ పాత్రలు చేయడానికైనా రెడీ. కానీ, కథ డిమాండ్ చేయాలి.
మీరు స్క్రిప్ట్లు ఎంచుకునే విధానం ఎలా ఉంటుంది?
నివేతా పేతురాజ్: కెరీర్ ప్రారంభంలో విన్న ప్రతి స్క్రిప్ట్కు ఓకే చెప్పేసేదాన్ని. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి సినిమాల్లో నా పాత్ర చూసుకున్నాక, నా స్క్రిప్ట్ ఎంపిక విధానం మారిపోయింది. బలమైన ముద్ర వేసే పాత్రలు మాత్రమే ఇకపై ఎంచుకుంటాను.
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు రావడంపై?
నివేతా పేతురాజ్: ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతురాలిని. మంచి స్క్రిప్ట్లు రావడం వల్లే త్వరగా ఇక్కడ సక్సెస్ అందుకోగలిగాను. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు.
రెడ్ సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది?
నివేతా పేతురాజ్: కచ్చితంగా బ్లాక్బస్టర్ కొడుతుంది. ఏదైనా సినిమా షూటింగ్ మొదలుపెట్టిన మూడు రోజుల్లోనే మనకు ఫలితం ఎలా ఉండబోతుందో అర్థమౌతుంది. షూటింగ్ చేసినన్ని రోజులు సెట్లో పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. రామ్ నటనైతే ఈ సినిమాలో అత్యద్భుతం.
ఇకపై ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనుంటున్నారు?
నివేతా పేతురాజ్: కేవలం హీరోయిన్ పాత్రలే చెయ్యాలని లేదు. నేను లేడీ విజయసేతుపతిలా ఉండాలనుకుంటున్నాను. ఆయన హీరో, విలన్, తండ్రి, అన్న వంటి అన్ని పాత్రలు చేస్తారు. నాక్కూడా అలా చేయాలనుంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం