ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు: తారక్
అభిమానుల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని నందమూరి తారక రామారావు అన్నారు. వెండితెర వేదికగా అభిమానుల్ని అలరించిన ఆయన దాదాపు కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్: అభిమానుల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని నందమూరి తారక రామారావు అన్నారు. వెండితెర వేదికగా అభిమానుల్ని అలరించిన ఆయన కొన్నేళ్ల విరామం తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారంకానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. ఆ వేడుకలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తారక్ ఏమన్నారంటే..
ఈ షో ఒప్పుకోవడానికి ప్రధాన కారణమేమిటి?
తారక్: ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. వివిధ జీవన స్థితిగతుల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడమే దీని లక్ష్యం. గతంలో చిరంజీవి, నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. కాబట్టి నాకు ఇది ఓ ఛాలెంజ్. నా వంతు మార్క్ క్రియేట్ చేయడానికి కృషి చేస్తా.
దాదాపు మూడేళ్లుగా మీరు సినిమాల్లో కనిపించలేదు. సోషల్మీడియాలో యాక్టివ్గా లేరు. అభిమానులు మీకు పంపించే సందేశాలు చూస్తారా?
తారక్: మొదటి నుంచి సోషల్మీడియాలో నేను అంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు. ఫ్యాన్స్ నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం అనుకుంటున్నారు? అనే విషయాన్ని ప్రతిసారీ నా టీమ్ నాకు సమాచారాన్ని ఇస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ అంతలా డిమాండ్ చేసింది.. అందుకే మూడేళ్ల నుంచి కనిపించడం లేదు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్లో భాగమైనందుకు గర్విస్తున్నా. మన హీరోలకు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చే చిత్రమది. అలాగే, నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఖాళీ సమయాన్ని వాళ్లతో సరదాగా గడుపుతున్నాను. అంతకు మించి నేను ఏం కోరుకుంటాను.
రాజకీయ ప్రవేశం ఎప్పుడు?
తారక్: ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు’. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం(నవ్వులు).
ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్.. రామారావుగా ప్రమోట్ అయ్యాడా?
తారక్: జూనియర్ ఎన్టీఆర్, తారక్, రామారావు ఇలా ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా. ఇలాగే పిలవండి అని నేను ఎప్పుడూ పట్టుబట్టి అడగలేదు.
నేను అభిమానులకు చేసిన దానికంటే అభిమానులు నాకు చేసింది చాలా ఎక్కువ. మీరు ఇలా చేస్తే బాగుంటుందని నేను ఏరోజూ వాళ్లతో చెప్పలేదు. వాళ్లే అనుకుని ఎన్నో మహోన్నతమైన సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. ఏ హీరో అభిమాని అనేది ముఖ్యం కాదు.. మనుషులుగా సేవా చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అభిమానుల రుణం నేను ఏ రోజుకీ తీర్చుకోలేను. రుణం తీరని బంధం అది. అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగే స్థాయిలో నేను తప్పకుండా పనిచేస్తా. మీ నమ్మకాన్ని ఒమ్ముచేయను.
షో ఫార్మాట్ ఏం మారలేదు. ఈ షో నుంచి డబ్బులు ఎంత తీసుకువెళ్లామన్నది ముఖ్యం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్లు తప్పకుండా ఆత్మవిశ్వాసంతో వెళ్లేలా చేయడమే నా బాధ్యత.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM