Shree Karthick: అల్లు అర్జున్ కోసం ఐదేళ్లయినా వేచి చూస్తా: శ్రీ కార్తిక్
‘ఒకే ఒక జీవితం’ చిత్ర దర్శకుడు శ్రీ కార్తిక్ ఇంటర్వ్యూ. ఆయన చెప్పిన విశేషాలివీ..
ఇంటర్నెట్ డెస్క్: కొందరు దర్శకులు కమర్షియల్ హంగులను పక్కనపెట్టి, మనసును హత్తుకునే కథను తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుంటారు. ఆ జాబితాలో నిలిచేవారిలో శ్రీ కార్తిక్ (Shree Karthick) ఒకరు. శర్వానంద్ (Sharwanand) హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో శ్రీ కార్తిక్ విలేకరుల సమావేశంలో పాల్గొని, తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ అంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని, ఆయనతో సినిమా చేయాలనుందని తెలిపారు. శ్రీ కార్తిక్ చెప్పిన సంగతులివీ..
అమ్మే కారణం..
‘ఒకే ఒక జీవితం’ కథ పూర్తవడానికి రెండేళ్ల సమయం పట్టింది. దానికి న్యాయం చేసే నటుడు ఎవరా? అని ఆలోచించి, ఎంపిక చేసేందుకు మరో ఏడాదిన్నర గడిచింది. ఆ తర్వాత కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు ఆలస్యమైంది. అలా ఇన్నాళ్లకు నా తొలి సినిమా మీ అందరి ముందుకొచ్చింది. నా నిరీక్షణకి తగ్గ ఫలితం దక్కింది. ఎంతో ఆనందంగా ఉంది. దీనంతంటికీ కారణం మా అమ్మ. తాను అనారోగ్యానికి గురై, మంచానికే పరిమితమైనప్పుడు నేను తీసిన ఓ లఘు చిత్రాన్ని చూపించాలనున్నా. నా ఆశ నెరవేరక ముందే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని, అయ్యాననే విషయం తనకు తెలియదు. ఆ విషయంలో చాలా బాధ పడ్డా. అందుకే కాలం వెనక్కి వెళ్తే బాగుండు అనుకునేవాడిని. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘ఒకే ఒక జీవితం’.
అందుకే సైన్స్+ ఎమోషన్
నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తే ఈ సినిమాకు ప్లస్ అయింది. ఒకవేళ ఈ చిత్రంలో సైన్స్ అంశాలను ముడిపెట్టకపోతే మెలోడ్రామాగా సాగేది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించాలనే ఉద్దేశంతోనే ఎమోషన్, సైన్స్ను మిక్స్ చేశా. ప్రేక్షకుల నుంచి ఊహించిన స్పందన లభించింది. భవిష్యత్తులో మరిన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వస్తాయని అనుకుంటున్నా. ఈ జానర్ కథలను తెరకెక్కించటంలో ట్రెండ్ సెటర్గా నిలిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారికి ఈ చిత్రాన్ని చూపించి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలనుంది.
అదే పెద్ద విజయం
దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టు తెరపైకి రావాలంటే నటులు, సాంకేతిక నిపుణుల సమృష్టి కృషి ఉండాలి. ‘ఒకే ఒక జీవితం’తో నాకు మంచి టీమ్ లభించింది. శర్వానంద్లాంటి హీరో ఈ సినిమాలో నటించడమే పెద్ద విజయం. తనకీ నాకూ ఈ చిత్రం ఎమోషనల్ రైడ్లాంటిది. శర్వాకు ఈ సినిమా మంచి విజయం అందిస్తుందనే నా నమ్మకం నిజమైనందుకు సంతోషిస్తున్నా. అమ్మ పాత్ర కోసం అక్కినేని అమలగారినే తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నా. ఆమెకు కథ బాగా నచ్చటంతో నటించేందుకు ఓకే చెప్పారు.
ప్రశంసలు..
సినిమా చూసిన తర్వాత ‘ఇకపై నిన్ను నా కొడుకులాచూస్తా’ అని నాగార్జునగారు శర్వానంద్తో అన్నారు. అదే నాకూ దక్కిన గొప్ప ప్రశంసగా భావిస్తా. నాగార్జునేకాదు అఖిల్ కూడా సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారు. దాన్నుంచి తేరుకోలేకపోవడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాలేకపోయారు. మారుతితోపాటు మరికొందరు దర్శకులు ‘ఒకే ఒక జీవితం’ గురించి గొప్పగా మాట్లాడటాన్ని మర్చిపోలేను.
డ్యాన్సర్ నుంచి డైరెక్టర్గా..
నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. దాని తర్వాత డ్యాన్స్ స్కూల్ ప్రారంభించటమో, న్యూయార్క్ వెళ్లి డ్యాన్స్లో మాస్టర్స్ చేయటమో.. వీటిల్లో ఏదో ఒకటి చేయాలనుకున్నా. ఆ సందిగ్ధం వీడక ముందే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. దానికి రాధిక, గౌతమిగారు న్యాయ నిర్ణేతలు. నా డ్యాన్స్, హావభావాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. దాంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. ‘మనమూ నటుడుగా మారొచ్చు’ అని అనుకున్నా. నటుణ్ని కావాలని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ‘ఎవరో రాస్తే, తీస్తే నేను నటించటం ఏంటి?.. నేనే రాయాలి, నేనే తీయాలి’ అని ఫిక్స్ అయ్యా. అలా.. షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ చేశా. ఇలా మీ ముందుకు వచ్చా.
అల్లు అర్జున్తో చిత్రం..
నా తదుపరి చిత్రం తెలుగులోనే తెరకెక్కిస్తా. భారీ బడ్జెట్తో తెరకెక్కబోయే ఆ సినిమా కోసం మంచి నిర్మాణ సంస్థను అన్వేషిస్తున్నా. నాతో సహా మా కుటుంబమంతా అల్లు అర్జున్ను ఇష్టపడుతుంది. ఆయనతో సినిమా చేయాలనుంది. దాని కోసం ఐదేళ్లు ఎదురుచూడాలన్నా నాకు ఓకే.
వ్యక్తిగతం..
నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. అమ్మ బి.ఎస్.ఎన్.ఎల్ ఆఫీసర్గా చేశారు. అమ్మే మా కుటుంబాన్ని చూసుకుంది. అమ్మ మాతృభాష తెలుగు. నాకు నచ్చిన నగరాల్లో హైదరాబాద్ ముందుంటుంది. మనం నిజాయతీగా పనిచేస్తే ఈ విశ్వం మనకు తోడవుతుందనే విషయాన్ని నేను బాగా నమ్ముతా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.