క్యారేజ్‌ ముట్టుకుంటే నా మీద ఒట్టే..

ఒకప్పుడు అలనాటి నటులు ఎన్టీఆర్‌, రావుగోపాల్‌ రావు.. వీరంతా సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండేవారు. ఓసారి ప్రముఖ

Published : 13 Mar 2021 15:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు అలనాటి నటులు ఎన్టీఆర్‌, రావుగోపాల్‌ రావు.. వీరంతా సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండేవారు. ఓసారి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సెట్స్‌కు వెళ్లి సీన్స్‌ చదివి వినిపిస్తున్నారు. అదే సమయంలో గోపాలకృష్ణ ఇంటి నుంచి భోజనం వచ్చింది. ఆయన సతీమణి తొక్కు పచ్చళ్లు ఎక్కువగా పెడుతుండేవారు. ఓసారి రావుగోపాల్‌ రావు ఆ వంటలను రుచిచూశారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా గోపాలకృష్ణ ఇంటి నుంచి క్యారేజ్‌ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే రావుగోపాల్‌ రావు..‘ఆ క్యారేజ్‌ని గోపాలకృష్ణతో పాటు ఎవరు ముట్టుకున్నా నా మీద ఒట్టే’ అని అరిచేశారట. ఇందుకు గోపాలకృష్ణ కూడా ఒప్పుకోక తప్పలేదు. రావుగోపాల్‌ రావు స్వయంగా భోజనం వడ్డించుకుని ఒక్కో ముద్ద తింటూ..‘ఈ ముద్ద జస్టిస్‌ చౌదరి, ఈ ముద్ద కొండవీటి సింహం, ఈ ముద్ద ఖైదీ..’ అంటూ లొట్టలేసుకుని తినేవారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు