Naresh: సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన నరేశ్‌, పవిత్ర లోకేష్‌

తమపై కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌ అసత్య ప్రచారం, ట్రోల్స్‌ చేస్తున్నాయని సినీ నటుడు నరేశ్‌, పవిత్ర లోకేష్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 27 Nov 2022 01:38 IST

హైదరాబాద్‌: సినీ నటులు నరేష్, పవిత్ర లోకేష్‌లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తమపై కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌ అసత్య ప్రచారం, ట్రోల్స్‌ చేస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని వెబ్‌సైట్స్‌ తమ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వైరల్‌ చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పోస్టులన్నీ తమ ప్రైవసీకి భంగం వాటిల్లేలా ఉన్నాయని పోలీసులకు నివేదించారు. వెంటనే అలాంటి వేదికలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. నరేష్‌, పవిత్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని