Payal rajput: నటులకి అవి చాలా బాధని పంచుతాయి
పాయల్ రాజ్పూత్... తెలుగులో తొలి సినిమాతోనే పరిశ్రమలో చర్చని లేవనెత్తిన కథానాయిక. సాహసోపేతం అనిపించే పాత్రని పోషించి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.
పాయల్ రాజ్పూత్... తెలుగులో తొలి సినిమాతోనే పరిశ్రమలో చర్చని లేవనెత్తిన కథానాయిక. సాహసోపేతం అనిపించే పాత్రని పోషించి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఆ ప్రయత్నమే ఆమెని బిజీ కథానాయికగా మార్చింది. ఆ తర్వాత తెలుగులో పలు అవకాశాల్ని అందుకున్నా... తొలి సినిమా స్థాయి ప్రభావం చూపించలేకపోయింది. మళ్లీ తన తొలి సినిమా ‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతితో మరోసారి జట్టు కట్టి ఇటీవల ‘మంగళవారం’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా పాయల్ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది.
‘మంగళవారం’ కథ విన్న తర్వాత మీ మనసులో మెదిలిన ఆలోచనలేమిటి?
ఇది నిజంగా జరిగిందా... ఈ పాత్ర నిజమైనదేనా? అని అడిగా. ఇలాంటి గాఢమైన భావోద్వేగాలున్న సినిమాల్ని ఇదివరకు నేను కూడా చేశా కానీ... ఈ తరహా కథ, పాత్రల గురించి ఎప్పుడూ వినలేదు. ఓటీటీ వేదికల్లో ఎన్నో దేశాలకి చెందిన సినిమాల్ని చూశా కానీ, ఎక్కడా ఈ తరహా కథ రాలేదు. కథ విన్నప్పుడే ‘మంగళవారం’ నన్నెంతో ఆత్రుతకి గురిచేసింది.
మీకంటే ముందు ఈ సినిమా కోసం చాలా మంది కథానాయికల్ని ఆడిషన్స్ చేశారట కదా...?
ఓ కొత్త కథానాయికని పరిచయం చేయాలనుకున్నారు అజయ్ భూపతి. నేనేమో ‘సార్... నాకు ఒక అవకాశం ఇవ్వండి’ అని ఎప్పుడూ అడిగేదాన్ని. చిన్న పాత్రయితే ఇవ్వను, బలమైన కథ కుదిరితే కచ్చితంగా ఫోన్ చేస్తా అని చెప్పేవారు. నా శక్తి సామర్థ్యాలు తెలిసిన దర్శకుడు ఆయన. మళ్లీ ఓసారి ఫోన్ చేసినప్పుడు ‘కొత్త సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి’ అని చెప్పారు. నాకు అవకాశం ఇస్తే నా కెరీర్కి మరో మలుపు అవుతుందని చెప్పా. దాంతో ఆయన ఆడిషన్స్కి పిలిచి, లుక్ టెస్ట్లు చేసి నన్ను ఎంపిక చేశారు.
అసలు ఈ పాత్ర ఎలా ఉంటుంది? నటిగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు?
శైలు అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర. నా వ్యక్తిత్వానికీ, ఈ పాత్రకీ పది శాతం కూడా పోలికలు ఉండవు. నేనెప్పుడూ నవ్వుతూ ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా గడిపే అమ్మాయిని. కానీ ఈ పాత్ర అందుకు పూర్తి భిన్నం. అందరిలాగే సరదాగా గడిపే శైలు అనుకోకుండా కొన్ని అసాధారణ అనుభవాల్ని ఎదుర్కొంటుంది. అదేమిటనేది ఈ సినిమాలో కీలకం. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తూ రూపొందించిన చిత్రమిది. ఈ పాత్ర మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లు విసిరింది. మేకప్ కోసమే రెండు గంటలు పట్టేది. ఈ పాత్రతో భావోద్వేగమైన ప్రయాణం చేశా. దాన్నుంచి బయటికి రావడానికి కూడా నాకు దాదాపు 15 రోజులు పట్టింది. శైలు పాత్ర అందరి సానుభూతిని పొందేలా ఉంటుంది. అజయ్ భూపతి చాలా జాగ్రత్తలు తీసుకుని నాతో ఈ పాత్రని చేయించారు. నిర్మాతలు స్వాతిరెడ్డి, సురేష్ వర్మ ఎప్పుడూ నటులు, సాంకేతిక బృందం సౌకర్యంగా ఉందా లేదా అని ఆరా తీస్తూ నిర్మాణం చేశారు.
తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ అందుకు దీటుగా మీ ప్రయాణం సాగలేదేమిటి?
సినిమా విజయవంతం అయినప్పుడే నటుల కష్టం వెలుగులోకి వస్తుంది. సినిమా పరాజయాన్ని చవిచూసిందంటే, అందులో మన ప్రతిభ, కష్టం ఎంతున్నా గుర్తింపుకు నోచుకోదు. నా విషయంలో అదే జరిగింది. కొన్నిసార్లు నేను సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేదేమో. చిత్రసీమలో నాకు మార్గదర్శిలా ఉన్నారు అజయ్ భూపతి. తను అప్పుడప్పుడూ ఫోన్ చేసి ‘అసలు ఇలాంటి కథని ఎలా ఎంచుకున్నావు?’ అని కోప్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ అనుభవాల తర్వాత మళ్లీ నా ప్రతిభని నిరూపించుకోవాలనే తపనతో పనిచేస్తూ వచ్చా. కొన్నాళ్లుగా నా విధిరాతతో పోరాటం చేస్తున్నా.
తెలుగులో ఇప్పటిదాకా సాగించిన ప్రయాణాన్ని వెనుదిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?
చిత్రసీమలో ప్రయాణం అనిశ్చితం. ఎత్తు పల్లాలు చాలా ఉంటాయి. ఉన్నట్టుండి తారాస్థాయికి చేరుకుంటాం, ఆ వెంటనే కిందపడిపోతాం. నటులకి ఈ ఆటుపోట్లు చాలా బాధకి గురిచేస్తుంటాయి. కానీ ఈ ఐదేళ్ల ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది. తొలి సినిమా ‘ఆర్ఎక్స్100’ నాకు చాలా పేరు తీసుకొచ్చింది. అయితే అందులో వ్యతిరేక ఛాయలున్న పాత్ర కావడంతో... ఆ కోణంలోనే నన్ను పరిశ్రమ చూసింది. కానీ నేనొక నటిని, నేను అన్ని రకాల పాత్రలూ చేస్తానని రుజువు చేసుకుంటూ వస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!