Ram Charan: దాని గురించి ఆలోచిస్తే కాళ్లు వణుకుతాయి.. ‘నాటు నాటు’ అందరిదీ..: రామ్చరణ్
ప్రస్తుతం అమెరికాలో ఉన్న రామ్చరణ్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఆస్కార్కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాట గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ప్రేక్షకులందరిదని, దాని చిత్రీకరణ గురించి ఆలోచిస్తే ఇప్పటికీ కాళ్లు వణుకుతుంటాయని ప్రముఖ హీరో రామ్చరణ్ (Ram Charan) అన్నారు. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్లో జరగనున్న ఆస్కార్ వేడుక (Oscar Awards 2023)ల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన రోజుకో హాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ‘ఎంటర్టైన్మెంట్ టునైట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని కొన్ని విశేషాలివీ..
4 కిలోల బరువు తగ్గా..
‘‘నాటు నాటు’ పాట మాది మాత్రమే కాదు ప్రేక్షకులందరిదీ. భిన్న సంస్కృతులకు చెందిన అన్ని వయసులవారు దాన్ని ఆస్వాదించారు. సాహిత్యం అర్థంకాకపోయినా తమ పాటగా స్వీకరించారు. అందులోని బీట్ అలాంటిది. జపాన్ నుంచి యూఎస్ వరకు ప్రతి ఒక్కరూ ఆ గీతానికి ఎంతో హుషారుగా డ్యాన్స్ చేయడం నేను గమనిస్తున్నా. ఇంతకు మించి నేనేం కోరుకోవట్లేదు. ఉక్రెయిన్ ప్రెసిడెన్సియల్ ప్యాలెస్ ముందు వారం పాటు ‘నాటు నాటు’ పాటకు సంబంధించి రిహార్సల్ చేశాం. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ కూడా నటనా అనుభవం కలిగినవారు గనక అక్కడ షూటింగ్ చేసుకుంటామనే మా విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. ఆ పాట చిత్రీకరణలో 150 మంది డాన్సర్లు పాల్గొన్నారు. 200 మంది సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. 17 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. కొన్ని స్టెప్పులకు చాలా రీటేక్స్ తీసుకున్నాం. దానివల్ల నేను 4 కిలోల బరువు తగ్గా. ఆ కష్టం గురించి ఆలోచిస్తే నా కాళ్లు వణుకుతాయి’’
ఆయన్ను సపోర్ట్ చేసేందుకు వచ్చాం..
‘‘నా నుంచి, ఎన్టీఆర్ నుంచి తనకు ఎలాంటి ఔట్పుట్ కావాలన్న దానిపై రాజమౌళికి స్పష్టత ఉంది. మా డ్యాన్స్ విషయంలో ఆయన స్ట్రిక్ట్గా ఉండేవారు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వచ్చేలా చేసేవారు. దాని కోసం మమ్మల్ని హింస పెట్టేవారు (నవ్వుతూ). కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉంది. రాజమౌళితో కలిసి పనిచేసే సమయంలో నా బ్రెయిన్ని స్విచ్ఛాఫ్ మోడ్లో పెట్టేస్తా. ఎందుకంటే ఆయన మనసులో ఏముందో మనం ఊహించలేం. ఓ టెక్నీషియన్గా తనకేం కావాలో బాగా తెలుసు. త్వరలోనే జరగబోతోన్న ఆస్కార్ వేడుకలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు కాస్త టెన్షగా ఉంది. నేను అభిమానించే తారలంతా ఆ ఈవెంట్కు వస్తారు. దాంతో, అక్కడ నేను అభిమానిగా ప్రవర్తిస్తానో, ఓ నటుడిగా ఉంటానో చూడాలి. టామ్క్రూజ్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో కలిసి పని చేసే అవకాశం వస్తే చాలా గొప్ప. ఆస్కార్ అవార్డుకి మా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి అర్హులు. 27 ఏళ్ల ప్రస్థానం ఆయనది. ఆయన్ను సపోర్ట్ చేయడానికి ఓ కుటుంబంలా మేమంతా ఇక్కడకు వచ్చాం’’
వాటిల్లో నటించాలనుంది..
‘‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మేం ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమ, అభినందనలు దక్కాయి. ఇప్పుడు ఇవన్నీ అదనం. మేం ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నాం. మంచి సినిమాకు భాషతో పనిలేదనడానికి ‘ఆర్ఆర్ఆర్’ ఓ ఉదాహరణ. భిన్న సంస్కృతులకు చెందిన ప్రేక్షకులు ఇష్టపడే ఫ్రాంచైజీ చిత్రాల్లో నేను భాగం కావాలనుకుంటున్నా. ఇప్పుడు సినిమా గ్లోబల్ అయ్యింది. సినిమాకున్న హద్దులన్నీ చెరిగిపోతున్నాయి. ఇలాంటి సినీ గ్లోబలైజేషన్ సమయంలో నేను సినీ ఇండస్ట్రీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. నేను హాలీవుడ్లో చాలా మంది దర్శకులతో కలిసి పని చేయాలనుకుంటున్నా. వారిలో జె. జె. అబ్రమ్స్ ముందుంటారు. ఆ తర్వాత క్వాంటిన్ టరాన్టినో. నా ఆల్టైమ్ ఫేవరేట్ మూవీస్లో ఈయన తెరకెక్కించిన ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’ ఒకటి. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ఈ దర్శకులు వారితో పని చేసే నటులకు సవాలు విసురుతుంటారు’’ అని రామ్ చరణ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత