Ram Charan: ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఆరోగ్యకరమైన పోటీ.. త్వరలోనే ‘గ్లోబల్ సినిమా’: రామ్చరణ్
టాలీవుడ్ నటుడు రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ బృందంతో కలిసి లాస్ఏంజెల్స్ వెళ్లారు. హాలీవుడ్ విలేకరులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: సుమారు 30 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ కుటుంబం, తమ కుటుంబం మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉందని కథానాయకుడు రామ్చరణ్ (Ram Charan) అన్నారు. ఎన్టీఆర్ (NTR)తో కలిసి చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Awards) వచ్చిన సంగతి తెలిసిందే. లాస్ఏంజెల్స్లో జరిగిన ఆ వేడుకకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఎన్టీఆర్తో కలిసి హాజరైన చరణ్ అక్కడి విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తున్నారు. అందులోని ఓ ఇంటర్వ్యూ విశేషాలివీ..
అవే ఎక్కువ ఇష్టం..
‘‘కొన్ని సినిమాల్లోని పాత్రలకు బాగా కష్టపడాల్సి వస్తుంది. నా కెరీర్లో సవాలుగా తీసుకుని చేసిన చిత్రం ‘రంగస్థలం’. అందులో నేను పల్లెటూరి వ్యక్తిగా, చెవిటివాడి పాత్రలో కనిపిస్తా. దాన్నుంచి నటుడిగా మంచి అనుభవాన్ని గడించా. ప్రేక్షకులు ఆ సినిమాపై విశేష ఆదరణ చూపించి, ఇండస్ట్రీ హిట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఛాలెంజ్ ఎదురైంది. దర్శకుడు రాజమౌళి నటుల హావభావాలపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆ ప్రక్రియను బాగా ఎంజాయ్ చేశా. ఈ చిత్రానికి జపాన్, అమెరికాలోనూ మంచి స్పందనరావడం చాలా ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా నేను డ్రామా, ఇంటెన్సివ్ సబ్జెక్ట్లను బాగా ఇష్టపడతా’’
స్ఫూర్తినిస్తాయి..
‘‘హాలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని వుడ్లు పోయి త్వరలోనే ‘గ్లోబల్’ సినిమా అనే పేరొస్తుందని ఆశిస్తున్నా. ‘టాప్గన్’ సిరీస్ చిత్రాలు నా ఫేవరెట్. ఇటీవల వచ్చిన ‘టాప్గన్: మావెరిక్’లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేశాయి. అలాంటి సినిమాలు నాకు స్ఫూర్తినిస్తుంటాయి’’
2022.. మరిచిపోలేని సంవత్సరం
‘‘ప్రతి ఏడాదీ బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తా. 2022.. నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరంగా నిలిచింది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లినప్పుడు నేను తండ్రిని కాబోతున్నాననే శుభవార్త తెలిసింది. ‘ఆర్ఆర్ఆర్’ నాకు ఎన్నో జ్ఞాపకాలు అందించింది. నేను ఇలా మీ అందరితో మాట్లాడుతున్నానంటే ఏదో సాధించినట్టుగా ఉంది. ప్రస్తుత క్షణాల్ని బాగా ఆస్వాదిస్తున్నా’’
చురుకుగా ఉండను..
‘‘ఇండియాలో ఆన్స్క్రీన్ ఇమేజ్, ఆఫ్స్క్రీన్ ఇమేజ్.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సినిమా విశేషాలు పంచుకునేందుకు కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో అడుగుపెట్టా. అయితే, దాని వినియోగంలో చురుగ్గా ఉండను. సామాజిక మాధ్యమాల్లో కనిపించే కామెంట్ల కంటే థియేటర్లలో ప్రేక్షకులు చేసే కామెంట్లనే పట్టించుకుంటా’’
ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఆరోగ్యకరమైన పోటీ
‘‘మా కుటుంబంలో ఏడుగురు నటులున్నాం. కజిన్స్తో ఇంట్లోనే పోటీ ఉంటుంది (నవ్వుతూ..). అలానే, సుమారు 30 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో ఆరోగ్యకర పోటీ వాతావరణం ఉంది. తారక్ తాతగారు (నందమూరి తారకరామారావు), మా నాన్న (చిరంజీవి) మధ్య హెల్దీ కాంపిటిషన్ ఉండేది. అలాంటిది రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం మా ఇద్దరిని ఎంపిక చేశారు. తారక్తో కలిసి మరో సినిమా చేయాలనుంది. ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులకు సంతకం చేశా. 2023లో మూడు చిత్రాలు, 2024లో మూడు చిత్రాలు వస్తాయి’’ అని రామ్ చరణ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్