Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
సినీ తారల విషయంలో కొందరు అత్యుత్సాహం చూపుతుంటారు. పరిధులు దాటి వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తుంటారు. ఆయా ప్రముఖులు సమాధానం చెప్పినా మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనా వారిలో ప్రముఖ నటుడు రామ్చరణ్ సతీమణి ఉపాసన ఒకరు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖుల విషయంలో కొందరు అత్యుత్సాహం చూపుతుంటారు. పరిధులు దాటి వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తుంటారు. ఆయా వ్యక్తులు సమాధానం చెప్పినా మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారిలో ప్రముఖ నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) ఒకరు. పిల్లల గురించి ఎవరెన్నిసార్లు అడిగినా ఉపాసన స్పందించేవారు కాదు. అలాంటిది ఆమె ఓ వేదికపై ఈ విషయాన్ని ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ (Sadhguru) కార్యక్రమంలో ఉపాసన ఇటీవల పాల్గొన్నారు. ఆయనతో ఎన్నో విషయాలపై చర్చించిన ఉపాసన వ్యక్తిగతంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు.
‘‘మా పెళ్లై పదేళ్లయింది. నా వైవాహిక జీవితం చాలా చాలా ఆనందంగా ఉంది. నా జీవితం, నా కుటుంబాన్ని నేనెంతో ప్రేమిస్తున్నా. ఇదిలా ఉంటే కొంతమంది అదే పనిగా నా RRR (రిలేషన్షిప్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ మై లైఫ్) గురించి ప్రశ్నిస్తుంటారు ఎందుకు?. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు ఎందరో మహిళలకు ఎదురవుతోంది’’ అని ఉపాసన.. సద్గురుని సమాధానం కోరారు. ‘‘రిలేషన్పిష్.. అది వ్యక్తిగత అంశం కాబట్టి దాని గురించి నేనేం చెప్పలేను. రీప్రొడక్షన్ విషయానికొస్తే.. పిల్లలు కనకుండా ఉంటే నేను అవార్డు ఇస్తా. ఆరోగ్యం, సంతాన సామర్థ్యం ఉన్నా పిల్లలు కనకూడదని నిర్ణయించుకున్న వారికి అవార్డు ఇస్తానని నేనిప్పటికే ప్రకటించా. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు కనకపోవడమే గొప్ప సేవ చేసినట్టు. ఒకవేళ మీరు పులి అయితే పిల్లలు కనమని చెప్పేవాడ్ని. ఎందుకంటే ఆ జాతి అంతరించిపోతోంది కాబట్టి. ఇదేమీ అంతరించిపోయే జంతుజాలం గురించి చెప్పే ఉపన్యాసం కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అద్భుతమే. రాబోయే 30- 35 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరువయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉండటానికి కూడా చోటు సరిపోదు. పర్యావరణ విపత్తు సంభవించవచ్చు. మనసు పెట్టి ఆలోచిస్తే జనాభా తగ్గించటం అనేది సాధ్యపడుతుంది. బుర్రకు పని చెప్పకపోతే స్త్రీ/పురుష జననేంద్రియాలు మరింత యాక్టివ్గా పనిచేస్తాయి. దీని వల్ల ఈ ప్రపంచంలోకి మరింత మంది మనుషుల అడుగులు పడతాయి. ఒకానొక దశ దాటిని తర్వాత మనం కాలు కూడా కదలలేని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదంటే రెండో ఆప్షన్గా అవార్డులు ప్రదానం చేయడమే’’ అని సద్గురు వివరించారు. ‘‘మా అమ్మ, అత్తయ్య నుంచి మీకు కాల్ వస్తుంది’’ అని సద్గురుతో ఉపాసన నవ్వుతూ చెప్పారు. 2012 జూన్ 14న చరణ్, ఉపాసన వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..