RGV: మేం స్నేహితులం.. కేసు విత్‌డ్రా చేసుకుంటున్నాం: ఆర్జీవీ, నట్టి కుమార్‌

వ్యక్తిగతంగా నిర్మాత నట్టికుమార్ కుటుంబంపై తనకెలాంటి ద్వేషం లేదని, పరిస్థితుల ప్రభావం వల్ల తనపై కేసుపెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు దాన్ని విత్‌ డ్రా చేసుకున్నానని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.

Published : 11 Jun 2022 01:47 IST

హైదరాబాద్‌: వ్యక్తిగతంగా నిర్మాత నట్టి కుమార్ కుటుంబంపై తనకెలాంటి ద్వేషం లేదని, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన కుటుంబ సభ్యులపై కేసు పెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు దాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నానని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మా మధ్య గత కొన్ని రోజులుగా తలెత్తిన విభేదాలు ఇప్పుడు తొలగిపోయాయి. ఇప్పటి వరకు వారిపై నేను చేసిన వ్యాఖ్యలు, నా గురించి ఆయన అన్న మాటలను ఇద్దరం వెనక్కి తీసుకుంటున్నాం. భవిష్యత్తులో మేం కలిసి పనిచేస్తాం. అప్పుడున్న పరిస్థితుల వల్ల నట్టి కరుణ, క్రాంతిపై కేసు పెట్టాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా వారిపై నాకెలాంటి విరోధం లేదు’’ అని రామ్‌గోపాల్‌ వర్మ పేర్కొన్నారు.

అనంతరం, నట్టి కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. కొంతమంది మధ్యవర్తులు పెట్టిన చిచ్చు వల్ల మేమిద్దరం కాస్త దూరంగా ఉన్నాం. మా మధ్య చోటుచేసుకున్న అపార్థాలన్నీ వైదొలిగాయి. ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను పరస్పరం విత్‌డ్రా చేసుకుంటున్నాం’’ అని తెలిపారు. తన సంస్థ లెటర్‌ హెడ్‌ను కాపీ చేయడంతోపాటు తన సంతకాన్నీ ఫోర్జరీ చేసి దుర్వినియోగం చేశారంటూ నట్టి క్రాంతి కుమార్‌, నట్టి కరుణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు ఆర్జీవీ మే 28న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని