Rashmika: గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చా: రష్మిక
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తనకు మంచి స్నేహితుడని మరోసారి స్పష్టం చేశారు నటి రష్మిక (Rashmika). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఎదురైన విమర్శలపై స్పందించారు.
హైదరాబాద్: ఆరేళ్ల కెరీర్లో సుమారు 17 చిత్రాల్లో నటించి నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. కెరీర్లో ఎదురైన విమర్శలపై స్పందించారు. ఈ రంగంలో విమర్శలు సహజమని అభిప్రాయపడిన ఆమె.. అవి మితిమీరినప్పుడు తప్పక పెదవి విప్పాలన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ట్రోల్స్పై (Social Media Trolling) స్పందిస్తున్నానని చెప్పారు. చిన్నప్పుడు స్కూల్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.
‘‘ఎలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. అదెలా సాధ్యం?’ అని ఇటీవల చాలా మంది నన్ను అడిగారు. చిరునవ్వుతో జీవించడాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నాను. స్కూల్లో చదువుకునేటప్పుడు కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉండేదాన్ని. సుమారు 800 మంది విద్యార్థులు అక్కడ ఉండేవారు. ఎవరూ నాతో సరిగ్గా ఉండేవారు కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉండటంతో ఎన్నో అపార్థాలు తలెత్తాయి. నేను చేయని తప్పులకు మాటలు పడేదాన్ని. ఆ సమయంలో ప్రతిరోజూ గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. అయితే, ఎలాంటి సమస్యలు వచ్చినా అమ్మతో పంచుకోవడం నాకు అలవాటు. ఆమే నన్ను ఇంత స్ట్రాంగ్గా చేసింది. ప్రపంచంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయని కాబట్టి దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటా’’ అని రష్మిక వివరించారు.
అనంతరం ఆమె ఇటీవల కిచ్చా సుదీప్ (Sudeep) ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి స్పందిస్తూ.. ‘‘నాకెంతో ఇష్టమైన ఓ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూని కొన్నిరోజుల క్రితం చూశాను. ఈ రంగంలో ఉన్నప్పుడు పూలదండలే కాదు. రాళ్లు, కోడిగుడ్లు విసిరినా తట్టుకోవాలని ఆయన అన్నారు. నేను దాన్ని అంగీకరిస్తాను. కాకపోతే, ఎదుటి వ్యక్తులు విసిరే రాళ్లు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు, ఆ దెబ్బలకు మీకు రక్తం చిందినప్పుడు ఎదురు తిరగక తప్పదు కదా’’ అని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)పై స్పందిస్తూ.. ‘‘విజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇటీవల న్యూ ఇయర్ రోజు నేను లైవ్లో ఉన్నప్పుడు వెనుక విజయ్ వాయిస్ వినిపిస్తోందని కామెంట్స్ పెట్టారు. వాటిని చూసి మేము నవ్వుకున్నాం. ఎందుకంటే ఆ సమయంలో మరో నలుగురి వాయిస్లు కూడా వినిపించాయి . వాటిని ఎవరూ పట్టించుకోలేదు. మేమిద్దరం కలిసి టూర్స్కు వెళ్లలేదని, పార్టీలు చేసుకోలేదని ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఫ్రెండ్స్ అన్నాక కలిసి టూర్స్కు వెళ్లడం సహజం’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!