Rashmika: ఉలిక్కిపడి లేచేదాన్ని..రాత్రంతా ఏడ్చేదాన్ని..: రష్మిక

తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకునే రష్మిక 2019లో విడుదలైన ‘డియర్‌ కామ్రెడ్’ సినిమాలోని లిప్‌లాక్‌ సీన్‌లో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి చెప్పింది.

Updated : 04 Oct 2022 09:56 IST

ఇంటర్నెట్ డెస్క్: ముద్దుగుమ్మ రష్మిక చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. తన తదుపరి చిత్రం ‘గుడ్‌బై’ ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా గడుపుతోంది. తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకునే ఈ హీరోయిన్‌ 2019లో విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలోని లిప్‌లాక్‌ సీన్‌లో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి చెప్పింది. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను ఆ రోజులను, ఆ సీన్‌పై వస్తున్న ట్రోల్స్‌ను ఎలా అధిగమించానో నాకే తెలియదు. నేను చాలా సున్నిత మనస్కురాలిని. కొంతమంది నాకు ఫోన్‌ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పేవాళ్లు. కానీ, కొందరు నన్ను దారుణంగా ట్రోల్‌ చేశారు. ఆ టైమ్‌లో నన్ను బాధించే ఘటనలు చాలా జరిగాయి. నేను ఎవరినో వేడుకుంటున్నట్లు కలలు వచ్చేవి. అందరూ నన్ను వెలివేసినట్లు కూడా కలలు వచ్చేవి. అలాంటి కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని. అలా రాత్రంత్రా ఏడుస్తూ ఉండేదాన్ని’’అని తన చేదు అనుభూతుల గురించి చెప్పింది రష్మిక.

ప్రస్తుతం ఈ నేషనల్‌ క్రష్‌ బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన ‘గుడ్‌బై’ సినిమా అక్టోబర్‌ 7న విడుదల కానుంది. ఈ చిత్రంతో రష్మిక బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనుంది. వీటితో పాటు సిద్దార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిషన్‌ మజ్ను’లో, రణబీర్ కపూర్‌ సరసన ‘యానిమల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని