అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా!

వెంకటేష్‌, మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి ఎంతో మంది నటుల్ని టాలీవుడ్‌కి పరిచయం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తొలి చిత్రం ఆయనతో చేస్తే చాలు నటనలో పాస్‌ అయినట్టేనని...

Published : 13 Feb 2021 12:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి ఎంతో మంది నటుల్ని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తొలి చిత్రం ఆయనతో చేస్తే చాలు నటనలో పాస్‌ అయినట్టేనని భావించే నాయకానాయికలెందరో ఉన్నారు. పైగా మాస్‌, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల వారి అభిమానం ఒకే చిత్రంతో సంపాదించుకోవచ్చనే భావనా ఉంటుంది. అందుకే అగ్ర నిర్మాతలు, నటులు సైతం  తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేసే ఆలోచన వచ్చిన వెంటనే రాఘవేంద్రరావుని సంప్రదిస్తుంటారు. ప్రభాస్‌ విషయంలోనూ ఇదే జరిగింది.  తనకు రాఘవేంద్రరావు సన్నిహితులు కావడంతో ప్రభాస్‌తో ఓ చిత్రం చేయమని అడిగారట ప్రభాస్‌ తండ్రి. హీరో అయ్యేందుకు తగిన మెళకువలు నేర్చుకున్నాడని మీ దర్శకత్వంలోనే తొలి చిత్రం రావాలని కోరారట. కానీ, అది సాధ్యమవలేదు.

‘ప్రభాస్‌ని నేనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నా. అప్పటికే నేను పలు సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు’ అని ఓ సందర్భంలో తెలియజేశారు రాఘవేంద్రరావు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి. దర్శకేంద్రుడికి కుదరకపోవడంతో ఈ అవకాశం జయంత్‌ సి. పరాన్జీకి దక్కింది. ఆయనే ప్రభాస్‌ని ‘ఈశ్వర్‌’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా సాధారణ నటుడిగా వచ్చిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ‘రాధేశ్యామ్‌’, ‘సలార్‌’, ‘ఆది పురుష్‌’తోపాటు నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.

ఇదీ చదవండి..

నవ్వులు పంచుతున్న ‘జాతిరత్నాలు’ టీజర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని