Sai Durga Tej: కొత్త ప్రయాణంపై సాయి దుర్గ తేజ్‌ పోస్ట్‌.. శుభాకాంక్షలు చెబుతోన్న ఫ్యాన్స్‌

నటుడిగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాయి దుర్గ తేజ్‌ (Sai Durga Tej)తన కొత్త ప్రయాణంపై పోస్ట్‌ పెట్టారు.

Published : 09 Mar 2024 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో సాయి దుర్గ తేజ్‌ (సాయి ధరమ్‌ తేజ్‌) కొత్త కబురు వినిపించారు. ఇంతవరకు నటుడిగా తెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిన ఆయన.. ఇప్పుడు చిత్ర నిర్మాతగానూ మారుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మామయ్యల ఆశీస్సులతో ఇది సాధ్యమైందంటూ పోస్ట్‌ పెట్టారు. కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌కు ‘విజయదుర్గ ప్రొడక్షన్స్‌’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.

విడాకుల వార్తలకు చెక్‌.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన నయన్‌ దంపతులు

‘నాకెంతో ఇష్టమైన మా అమ్మ పేరు మీద.. ఆవిడకు నేనిచ్చే బహుమతిగా నిర్మాణ సంస్థను ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువుగారు పవన్‌కల్యాణ్‌ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్‌ తొలినాళ్లలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు, ‘సత్య’ సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉంది’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ ప్రకటనపై పలువురు నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తల్లి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌ (Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు తెలిపారు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉన్నట్లుందనే ఉద్దేశంతో అలా చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ఈ హీరో రెండు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని