Samantha: ‘దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’.. వైరలవుతోన్న సమంత పోస్ట్‌

ప్రస్తుతం సమంత (Samantha) ‘ఖుషి’ షూటింగ్‌లో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఇన్‌స్టా స్టోరీ వైరలవుతోంది.

Updated : 10 Jul 2023 10:52 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) ప్రస్తుతం ‘ఖుషి’(Kushi) సినిమాలో నటిస్తోంది. అలాగే సిటడెల్‌ (Citadel) వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనుంది. అయితే, కొన్ని రోజులుగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సమంత ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సామ్‌ ఇన్‌స్టా స్టోరీ చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

తన ఇన్‌స్టాలో కారవాన్‌ ఫొటో పెట్టిన సమంత..‘‘మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది’’ అని పెట్టింది. అలాగే తన ఫొటో షేర్‌ చేస్తూ.. ‘‘ఆరు నెలలు కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’’ అని రాసింది. దీంతో తాను ఎంత కష్టంగా షూటింగ్స్‌లో  పాల్గొందో అని ఆమె అభిమానులు అనుకొంటున్నారు. ఇక ఈ పోస్ట్‌ చూసి అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 

ప్రస్తుతం విజయ్‌దేవకొండ (Vijay Deverakonda) సరసన సమంత (Samantha) నటిస్తోన్న ‘ఖుషి’(Kushi) చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘నా రోజా నువ్వే...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా అది ట్రెండింగ్‌లో నిలిచింది. సామాజిక మాధ్యమాల్లోనూ వంద మిలియన్ల వ్యూస్‌కి చేరువలో ఉంది. ఈ సినిమాను సెప్టెంబరు 1న తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని