Kasthuri: ‘సరోగసి’పై నటి ట్వీట్‌ దుమారం..!

నటి కస్తూరి చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నయనతార అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 10 Oct 2022 12:42 IST

హైదరాబాద్‌: నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సరోగసి పద్ధతిలోనే ఈ జంట తల్లిదండ్రులైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి కస్తూరి చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘‘ఇండియాలో సరోగసి బ్యాన్. 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీనిని ప్రోత్సహించకూడదు. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం’’ అంటూ ఆమె ఓ ట్వీట్‌ చేసింది. దీనిని చూసిన నయనతార అభిమానులు కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ పని మీరు చూసుకోండి’ అని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘అర్హత గల  న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు నాకు ఉంది. నేను ఎవర్నీ ఉద్దేశించి ఈ ట్వీట్‌ పెట్టలేదు’’ అని తెలిపారు.

నెటిజన్‌పై ఆగ్రహం..

‘మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అంటే మీకు ఇష్టం లేదట కదా’ అంటూ ట్వీట్‌ చేసిన ఓ నెటిజన్‌పై కస్తూరి (Kasthuri) ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్‌’లో ఓ చిన్న రోల్‌ చేసిన కస్తూరి.. ఇటీవల ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌మీట్‌ ఫొటోలు షేర్‌ చేయండి. మీకు చిరంజీవి అంటేనే అస్సలు నచ్చదట కదా. ఈ విషయాన్ని మా తల్లిదండ్రులు చెప్పారు. అలాంటప్పుడు ఆయన సినిమాలో ఎందుకు నటించారు?’’ అని ట్వీట్‌ పెట్టాడు.

దీనిపై కస్తూరి స్పందిస్తూ ‘‘ఏం మాట్లాడుతున్నారు? ఈ పిచ్చిమాటలు ఎందుకు? చిరంజీవి అంటే ఇష్టపడని వారుండరు. అలాంటిది నా విషయంలో మీ తల్లిదండ్రులు అలా చెప్పడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని