Sai Shivan: పాటల రచయితగా ప్రవేశించి.. దర్శకుడిగా మారి.. సాయి శివన్ ప్రయాణమిదీ!
‘గ్రంథాలయం’ సినిమాతో దర్శకుడిగా మారిన సాయి శివన్.. ప్రస్తుతం ‘వైరం’తో బిజీగా ఉన్నారు. మచిలీపట్నం వచ్చిన ఆయన్ను ‘న్యూస్టుడే’ పలకరించింది.
చిన్నాపురం (మచిలీపట్నం రూరల్): సాహిత్యంపై ఉన్న ఇష్టంతో సినీ రంగంలో ప్రవేశించాడతడు. ఓ వైపు పార్ట్టైమ్ జాబ్ చేస్తూనే లక్ష్యంగా దిశగా సాగాడు. లిరిసిస్ట్గా అవకాశం వచ్చిందనే ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైంది. అతడు పనిచేసిన సినిమాలు విడుదలకాకపోవడంతో నిరాశ ఎదురైంది. అయినా సంకల్పం వీడకుండా మరో అడుగు ముందుకేసి దర్శకుడిగా మారాడు. ‘గ్రంథాలయం’తో సత్తా చాటి, ద్విభాషా చిత్రం ‘వైరం’తో బిజీగా ఉన్న ఆ డైరెక్టర్ ఎవరో కాదు చిన్నాపురానికి చెందిన సాయి శివన్ జంపాన (Sai Shivan Jampana). ఇటీవల మచిలీపట్నం విచ్చేసిన ఆయన్ను ‘న్యూస్టుడే’ పలకరించింది.
* మీ కుటుంబ నేపథ్యమేంటి? సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన ఎలా వచ్చింది?
సాయిశివన్: నాన్న పేరు ఈశ్వరరావు. రైతు. అమ్మ వెంకటేశ్వరమ్మ.. గృహిణి. మాది సినీ నేపథ్య కుటుంబం కాదుగానీ మా తాత రామమూర్తి కళాకారుడు. ఆయన 400 నాటకాల్లో నటించారు. బాల్యం నుంచీ ఆయన ప్రభావం నాపై ఉంది. స్వయంగా పాటలు రాసి, పాడడం అంటే నాకు బాగా ఇష్టం. మచిలీపట్నంలో నేను చదివిన బాలసాయి డిగ్రీ కళాశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేవాణ్ని. అలా ఓ వేడుకలో నేను పాడిన పాట మా సంస్కృతం సర్కు నచ్చి, నన్ను మెచ్చుకున్నారు. నా ప్రతిభను సమాజం గుర్తిస్తుందనే నమ్మకం అప్పుడే కలిగింది. ‘నీ టాలెంట్కు నువ్వు సినిమా రంగంలో ఉండాలి’ అంటూ స్నేహితులు ప్రోత్సహించేవారు. కుటుంబం, మిత్రులు అందించిన సపోర్ట్తో చిత్ర రంగంలోకి అడుగుపెట్టా.
* సాహిత్యం, గానం అంటే ఇష్టమన్నారు కదా. దర్శకుడు కావాలని ఎప్పుడు అనుకున్నారు?
సాయిశివన్: పాటల రచయితగా స్థిరపడాలన్న లక్ష్యంతోనే 2010లో ఇండస్ట్రీలోకి వెళ్లా. అప్పుడు అక్కడ నాకెవరూ తెలియకపోవడంతో పరిచయాల కోసం నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగేవాణ్ని. ఆఫీస్బాయ్గా అయినా పని చేస్తానని అక్కడి వారిని అడిగేవాణ్ని. ఫలితంలేకపోవడంతో వేరేచోట పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ పొట్ట నింపుకున్నా. నా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఓ కో- ఆర్డినేటర్ ద్వారా కొంతమంది సినీ ప్రముఖులను పరిచయం చేసుకున్నా. క్రమక్రమంగా పాటలు రాయడం ప్రారంభించా. కొందరి వద్ద ఘోస్ట్ రైటర్గానూ పనిచేశా. నేను రాసిన పాటలు రికార్డు అయినా ఆయా సినిమాలు విడుదలకాకపోవడంతో నిరాశకు గురయ్యా. ‘ఇది కాదు మనం ఇంకేదో చేయాలి’ అనుకుంటూ ఉండగా దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందోనని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ముందడుగేసి.. అనుభవం కోసం ‘ఢమరుకం’, ‘గరుడవేగ’, ‘మహంకాళి’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నా. ఆ తర్వాత నేనే కథలు రాసుకుని, దర్శకుడిగా సినిమా తీసేందుకు నిర్మాతల కోసం అన్వేషించేవాణ్ని. ఆ ప్రయత్నంలోనే నిర్మాత జె. మల్లికార్జున నాకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. అదే ‘వైరం’.
* మీ రెండో సినిమా ముందు విడుదలైంది. ఆ సంగతేంటి?
సాయిశివన్: ‘వైరం’ (Vairam)లో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన విన్ను మద్యపాటి తక్కువ బడ్జెట్తో రూపొందించగలిగే కథ ఏదైనా చెప్పమని అడగ్గా ‘గ్రంథాలయం’ (Grandhalayam) కాన్సెప్ట్ గురించి చెప్పా. విన్నుతో కలిసి ఫైనాన్స్ చేసిన పార్టనర్స్ కొవిడ్ సమయంలో ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. అప్పుడు వైష్ణవి శ్రీ క్రియేషన్స్ సంస్థ ముందుకొచ్చి సినిమాని నిర్మించింది. త్వరగా చిత్రీకరణ పూర్తవడంతో నా రెండో సినిమా అయిన ‘గ్రంథాలయం’ ముందుగా విడుదలైంది. ఈ ఏడాది మార్చి 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నిర్మాతకు ఆర్థికంగానూ సంతృప్తినిచ్చింది.
* కన్నడ నటులతో సినిమా తీసే అవకాశం ఎలా వచ్చింది?
సాయిశివన్: పోస్టర్ డిజైనర్ విక్రమ్ రమేశ్ సూచనతో కన్నడ నటుడు దేవరాజ్ కుమారులను ఓ రోజు కలిసి ‘వైరం’ కథ వినిపించా. అది వారికి నచ్చడంతో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపారు. చిరవగా.. దేవరాజ్ రెండో కుమారుడు ప్రణమ్ దేవరాజ్ (Pranam Devaraj), ‘కేజీయఫ్’ (KGF) విలన్గా గుర్తింపు పొందిన రామచంద్రరాజు ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారు.
* తదుపరి ప్రాజెక్టుల వివరాలేంటి?
సాయిశివన్: సుడిగాలి సుధీర్, రష్మి కాంబినేషన్లో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. హీరో నానిని దృష్టిలో పెట్టుకుని కథ రాయడం పూర్తి చేశా. అనంత పద్మనాభస్వామి చరిత్ర ఆధారంగా స్టోరీ రాశా. ఇంకా నా దగ్గర సుమారు 50 స్టోరీలు సిద్ధంగా ఉన్నాయి.
* భవిష్యత్తుపై ఎలాంటి దృక్పథంతో ఉన్నారు?
సాయిశివన్: కష్టపడి పని చేస్తూ.. నిర్మాతకు నష్టం రానీయకుండా చూసుకోలానుకుంటున్నా. క్రేజ్ ఉన్న ఓ హీరోతోనైనా సినిమా తీసి హిట్ కొడితే చాలా అవకాశాలు వస్తాయి. దర్శకుడిగా రాణిస్తాననే నమ్మకం ఉంది. రాబోయే సినిమాలను మచిలీపట్నంలో షూటింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?