RRR: 4 ఏళ్లు.. రూ. 400 కోట్లు.. ‘RRR’ ఆ ఒక్క ఫొటోతో మొదలై..!
సినీ ప్రేక్షకలోకం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) అతి త్వరలోనే విడుదలకానుంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రేక్షకలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతుంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఒక్క ఫొటోతో ప్రారంభమై, దాదాపు 4 ఏళ్ల ప్రయాణం సాగించింది. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా మొదలైందంటే..
ఎవ్వరూ ఊహించని చిత్రం
అది 2017 నవంబరు 18. రామ్చరణ్, ఎన్టీఆర్లతో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి తన ట్విటర్ ఖాతాలో ఉంచారు. క్యాప్షన్ ఏం పెట్టకుండా కొన్ని డాట్స్ (...), ఓ ఎమోజీని జతచేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. ‘ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా వస్తుంది’ అని కొందరు, ‘ఇద్దరు హీరోలతో రాజమౌళికి పరిచయం ఉంది కాబట్టి సరదాగా కలిశారు’ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అసలు విషయం తెలియడానికి కొంత సమయం పట్టింది. ఎవ్వరూ ఊహించని ఈ చిత్రం అప్పట్లో వైరల్ అయింది. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ ఫొటోపై స్పందించారు. రామ్చరణ్ తానూ రాజమౌళి ఆహ్వానం మేరకు వారింటికి వెళ్లామని, ఈ సినిమా కథ వినకుండానే ఆ ఫొటో దిగామని, ఆ తర్వాత కథ విని, కాఫీ తాగామని తెలిపారు. అలా ఈ ఫొటోతో ‘కథ’ మొదలైంది.
టైటిల్.. ఆర్ఆర్ఆర్
2018 మార్చి 22న ఉత్కంఠ వీడింది. ‘రాజమౌళి (Rajamouli), రామ్చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) కలిసి పనిచేస్తున్నారు’ అనే అధికారిక ప్రకటన వెలువడింది. ముగ్గురు పేర్లలోని Rను కామన్గా తీసుకొని చిత్ర బృందం #RRR అనే హ్యాష్ట్యాగ్ను జతచేసింది. ఇది టైటిల్ కాదని, జస్ట్ వర్కింగ్ టైటిల్ అని పేర్కొంది. ఏడాది అనంతరం, 2019 మార్చి 18న ‘‘ఆర్ఆర్ఆర్’ అని వచ్చేలా ఆసక్తికర పేరును మాతో పంచుకోండి. దాన్నే టైటిల్గా ఖరారు చేస్తాం’ అని ప్రేక్షకులను కోరింది. ఈ ప్రక్రియకు అనూహ్య స్పందన లభించింది. వాటిల్లోని ఓ పేరు 2020 మార్చి 25న సినిమా టైటిల్గా మారింది. అదే ‘రౌద్రం రణం రుధిరం’. (Rise Roar Revolt) టైటిల్ ఫిక్స్ అయిన రోజే (మార్చి 25) సినిమా విడుదలవుతుండటం విశేషం.
అప్పుడలా మొదలైంది..
యావత్ సినీ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని పెంచిన ఈ మల్టీస్టారర్ 2018 నవంబరు 11న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నటులు చిరంజీవి, ప్రభాస్, రానా, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, వి. వి. వినాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇదే రోజు సాంకేతిక బృంద వివరాలు బయటకు వచ్చాయి. ఓ యాక్షన్ సన్నివేశంతో నవంబరు 19 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్, గుజరాత్, పుణె, ఉక్రెయిన్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు.
ఇదీ నేపథ్యం..
ఇద్దరు అగ్ర హీరోలు కలిసి పనిచేస్తున్నారనగానే అందరి చూపు కథ వైపే ఉంటుంది. సినిమా ఏ నేపథ్యంలో సాగుతుంది? ఎవరు ఎలా కనిపిస్తారు? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ఆ సందేహాలకు 2019 మార్చి 14న చిత్ర బృందం సమాధానాలిచ్చింది. ఇదే రోజు తొలిసారి ‘ప్రెస్ మీట్’ నిర్వహించి, సినిమా ఎలా ఉండబోతుందో కాస్త రుచి చూపించింది.
బ్రిటీష్ వారిని గడగడలాడించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామారాజు, నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమురం భీమ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఫిక్షనల్ స్టోరీ అని, బాలీవుడ్ నటులు అజయ్దేవ్గణ్, అలియాభట్, తమిళ దర్శకనటుడు సముద్రఖని నటిస్తున్నారని తెలిసింది. తర్వాత ఇదే రోజు.. 2020 జులై 30న ఈ సినిమా విడుదలవుతుందనే ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్, విలన్ పాత్రల్లో రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ నటిస్తున్నారని 2019 నవంబరు 19న చిత్ర బృందం తెలియజేసింది.
రికార్డు స్థాయిలో..
ఈ సినిమాలోని నాయకానాయికల ఫస్ట్లుక్లతోపాటు చిత్రీకరణకు సంబంధించిన ప్రతి ఫొటో వైరల్గా మారింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో వీడియో రూపంలో చూడాలనుకున్న వారి ఆసక్తికి 2020 మార్చి 27న తెరపడింది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి వీడియో ‘భీమ్ ఫర్ రామరాజు’ అందరినీ కట్టిపడేసింది. అల్లూరి సీతారామరాజు గెటప్లో రామ్చరణ్ కనిపించడం, ఆయన పోరాట పటిమ గురించి ఎన్టీఆర్ (కొమురం భీమ్) చెప్పడంతో ఈ వీడియో విడుదలైన అనతి కాలంలోనే కోట్ల వ్యూస్ సాధించింది. ఆ తర్వాత విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో, ‘దోస్తీ’, ‘నాటు నాటు’ తదితర పాటలు, ట్రైలర్.. ఇలా ప్రతిదీ నెట్టింట రికార్డు సృష్టించింది.
విడుదల తేదీ మారుతూ..
అనుకున్న సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తవకపోవడంతో చిత్ర బృందం ముందుగా ప్రకటించిన విడుదల తేదీని మారుస్తున్నట్టు 2020 ఫిబ్రవరి 5న ప్రకటించింది. ఈ సినిమాని 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామంటూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. కానీ, కొవిడ్/లాక్డౌన్ కారణంగా సాధ్యపడలేదు. 2021 అక్టోబరు 13కు ఈ చిత్రం వాయిదా పడింది. ‘ఎట్టకేలకు వచ్చేస్తుంది’ అని అందరూ భావించగా మరోసారి పోస్ట్పోన్ అయింది. 2022 జనవరి 7న విడుదలకు సిద్ధమవగా కరోనా థర్డ్వేవ్ అడ్డంకిగా మారింది. ఓ వైపు కొవిడ్ ఆంక్షలు, మరోవైపు థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ ఉండటంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం మరోసారి వాయిదాపడక తప్పలేదు. తర్వాత, పరిస్థితులు చక్కబడితే ‘2022 మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తాం’ అని ప్రకటించిన చిత్ర బృందం అనూహ్యంగా మార్చి 25వ తేదీని ఎంపిక చేసుకుంది.
ఈ ప్రయాణంలో..
రామ్చరణ్, ఎన్టీఆర్, రాజమౌళితోసహా చిత్ర బృందంలోని పలువురు కొవిడ్ బారినపడ్డారు. వ్యాయామం చేస్తుండగా రామ్చరణ్కు గాయమైంది. దాంతో యాక్షన్ సన్నివేశాల షెడ్యూల్ కొన్ని వారాలపాటు వాయిదా పడింది. ‘దోస్తీ’ పాటను రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్ర బందాన్ని కలచివేసింది. ఇలా ఎన్నో సవాళ్లు దాటుకొని.. నిప్పు (రామ్చరణ్), నీరు (ఎన్టీఆర్) ‘దోస్తీ’ని ప్రేక్షకులకు చూపించబోతుంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్టాపిక్గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?