Tammareddy Bharadwaj: పాన్‌ ఇండియా సినిమాలకు వందల కోట్లు ఎందుకు..?

‘పాన్‌ ఇండియా చిత్రాలకు రూ.వందల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి..?’’ అని ప్రశ్నిస్తున్నారు సీనియర్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్‌’ని వీక్షించిన ఆయన తాజాగా ఆ సినిమాపై .....

Updated : 10 Jun 2022 16:08 IST

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్‌ కామెంట్స్‌

హైదరాబాద్‌: ‘పాన్‌ ఇండియా చిత్రాలకు రూ.వందల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి..?’’ అని ప్రశ్నిస్తున్నారు సీనియర్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్‌’ని వీక్షించిన ఆయన తాజాగా ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.  ‘‘నిన్ననే నేను ‘మేజర్‌’ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా యాక్ట్‌ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. ఈ మధ్య మనం ఎక్కువగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, పాన్‌ ఇండియా సినిమా అని చెబుతున్నాం. నిజంగా చెప్పాలంటే.. ‘మేజర్‌’ పాన్‌ ఇండియా కథ. ‘మాది పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌.. బడ్జెట్‌ భారీగా అయ్యింది, లాస్‌లు వస్తున్నాయి’.. కాబట్టి మేము సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించండంటూ ముఖ్యమంత్రులను కోరడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి ఎన్నో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు ‘మేజర్‌’ ఏమాత్రం తీసిపోదు. టెక్నికల్‌, క్వాలిటీపరంగా సినిమా బాగుంది. ఈ చిత్రాన్ని రూ.25కోట్లలోపే పూర్తి చేస్తే.. మిగతా ప్రాజెక్ట్‌లకు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ‘మేజర్‌’ లాంటి చిత్రానికి ఖర్చు కానిది.. మీకు ఎందుకు అవుతుంది? అనేది ఆలోచించుకోవాలి. షూటింగ్‌ అని చెప్పి క్యారవాన్‌లో కూర్చుంటున్నారా..? సినిమా చేస్తే ప్యాషన్‌తో చేయాలి. సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవాలి’’ అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని