Balakrishna: ‘అఖండ’తో సినీ పరిశ్రమకు ఊపిరి : బాలకృష్ణ

‘అఖండ’ విజయం సాధించిన నేపథ్యంలో చిత్రబృందం గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల..

Updated : 16 Dec 2021 11:21 IST

హైదరాబాద్‌: ‘అఖండ’ విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రబృందం గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి  తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ‘‘కులమతాలు, పార్టీలకు అతీతంగా ‘అఖండ’ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు. కరోనా పరిస్థితుల్లో మా చిత్రం సినీ పరిశ్రమకు ఊపిరి పోసింది’’ అని బాలయ్య అన్నారు.

‘‘రాజమౌళితో సినిమా చేస్తున్నారా? మీ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తల్లో నిజమెంత?’’ అని విలేకర్లు అడగ్గా.. బాలయ్య మౌనంగా ఉండిపోయారు. ‘‘మౌనం అంగీకారమేనా?’’ విలేకర్లు అనగా.. బాలయ్య నవ్వారు. అనంతరం ‘అఖండ’ చిత్రానికి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నిర్మాత, దర్శకులు ధన్యవాదాలు తెలిపారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని