RGV: ఆ లాజిక్ చిత్ర పరిశ్రమకూ తెలియాలి.. సినిమా టికెట్ ధరలపై ఆర్జీవీ కామెంట్స్
సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించారు. యూట్యూబ్ ఛానల్ వేదికగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పలుమార్లు మాట్లాడిన ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆదివారం తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్ ఉంటే అది చిత్ర పరిశ్రమ వారికీ తెలియజేయాలని కోరారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘నేనెప్పుడూ ప్రభుత్వ పాలసీలు, రాజకీయాలను పెద్దగా పట్టించుకోను. నాకు వాటిపై అవగాహన లేదు. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్పైనా స్పష్టత ఉందో లేదో చెప్పలేను. చలన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, కామన్మ్యాన్గా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. నేనెవరినీ తప్పు బట్టడంలేదు. ఓ మ్యాన్యుఫ్యాక్చరర్ తాను తయారు చేసిన వస్తువును పలు రకాల ఫ్యాక్టర్స్ను బట్టి వెల నిర్ణయిస్తాడు. ఆ ధర వినియోగదారుడికి నచ్చితే వస్తువును కొనుక్కుంటాడు. ఇష్టం లేకపోతే మానేస్తాడు. ఒకవేళ ఆ వస్తువు అమ్ముడుపోతే సంబంధిత ట్యాక్స్ ప్రభుత్వానికి చేరుతుంది. చిన్న హోటల్ అయినా, ఫైవ్స్టార్ హోటల్ అయినా తినే ఆహారం ఒకటే. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు ఎంపిక చేసుకుంటారు. అది వారి వ్యక్తిగతం. థియేటర్ల విషయంలోనూ అంతే’’.
అందులో అర్థంలేదు..
‘‘సినిమా టికెట్ రేట్ల విషయానికొస్తే.. ఉదాహరణకు తెలుగు సినిమా మార్కెట్ రూ.100 కోట్లు ఉందనకుంటున్న రోజుల్లో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రూ. 200 కోట్ల బడ్జెట్తో ఓ సినిమా తీశారు. తమ ప్రొడక్ట్పై ఉన్న నమ్మకం అది. సూపర్ క్వాలిటీతో సినిమా తీస్తే మార్కెట్ను అధిగమించవచ్చని అలా చేస్తుంటారు. ఒకానొక సమయంలో పరాజయం పొందే అవకాశాలూ ఉండొచ్చు. ఒకవేళ అలా జరిగితే రాజమౌళి, శోభుకే నష్టం. లాభం వస్తే మొత్తం ఇండస్ట్రీకే పేరొస్తుంది. టాలీవుడ్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘బాహుబలి’. హాలీవుడ్ని తలదన్నే ప్రతిభ తెలుగువారికి ఉందని ఈ సినిమాతో రాజమౌళి నిరూపించారు. ‘బాహుబలి’కి మించి ‘ఆర్ఆర్ఆర్’.. దీనికి మించి మరొకటి రావొచ్చు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు, ఇతర సినిమాలకు ఒకే టికెట్ ధర చెప్పడంలో అర్థంలేదు’’.
ఆ వాదన అనవసరం..
‘‘సినిమాకు అయిన ఖర్చు రూ. 200 కోట్లు కాబట్టి రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో రాజమౌళినే టికెట్ ధర నిర్ణయించాలి తప్ప మరొకరు ఎలా చెప్తారు. సినిమా బడ్జెట్.. సుమారు 70 శాతం (రెమ్యూనరేషన్) హీరోలకే వెళ్లిపోతుందని, 30 శాతమే మేకింగ్ కాస్ట్ అని పేర్నినాని గారు, అనిల్కుమార్ యాదవ్ చెప్పిన దాంట్లో నిజంలేదు. ఎందుకంటే రెమ్యూనరేషన్, మేకింగ్ కాస్ట్ అంటూ ఏం ఉండవు. అంతా ఒకటే. రెమ్యూనరేషన్ కూడా ప్రొడక్ట్ మేకింగ్లో భాగమే. ప్రేక్షకులు థియేటర్కి వచ్చేది హీరోను చూసేందుకే! హీరోలు అంత మొత్తం తీసుకుని ప్రేక్షకులపై భారం మోపుతున్నారని వాదించటం కరెక్ట్ కాదు’’.
ఒకే ధర అంటే ఎలా?
‘‘బ్రాండెడ్ చొక్కా రూ. 50 వేలల్లో, సాధారణ చొక్కా రూ. 50కే లభించవచ్చు. అలాంటప్పుడు ‘షర్ట్’ అని బోర్డు పెట్టి రెండింటికీ ఒకే రేటు చెబితే ఎలా? సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్ ఉందా? ఉంటే అది చిత్ర పరిశ్రమకూ వివరించాలి. ధరను బట్టి టికెట్ కొనాలా, వద్దా? అని ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు. కొందరు హీరోలను కావాలని తొక్కేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తుందనడాన్ని నేను ఒప్పుకోను’’.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ