Rajamouli: రాజమౌళికి చక్కిలిగింత పెట్టిన తారక్‌.. ‘RRR’ ప్రెస్‌మీట్‌లో సరదా సంఘటన

కెరీర్‌ పరంగా రామ్‌చరణ్‌, తారక్‌ పెద్ద స్టార్‌ హీరోలైనప్పటికీ బయటమాత్రం మంచి స్నేహితులని దర్శకుడు రాజమౌళి అన్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌-తారక్‌లతో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన...

Updated : 11 Dec 2021 18:43 IST

హైదరాబాద్‌: కెరీర్‌ పరంగా రామ్‌చరణ్‌(Ram charan), తారక్‌(NTR) పెద్ద స్టార్‌ హీరోలైనప్పటికీ బయటమాత్రం మంచి స్నేహితులని దర్శకుడు రాజమౌళి(Rajamouli) అన్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌-తారక్‌లతో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలపై చిత్రబృందం స్పందించింది. అయితే, ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. హీరోలిద్దరూ సెట్‌లో ఎలా ఉంటారో రాజమౌళి సరదాగా చెబుతున్న సమయంలో పక్కనే కూర్చొన్న తారక్ ఆయనకు చక్కిలిగింత పెట్టారు. దాంతో జక్కన్న వెంటనే సీట్‌లో నుంచి పక్కకు వెళ్లిపోయారు.

‘‘వీళ్లిద్దరితో షూటింగ్‌ చేయడం ఎంత పెద్ద సమస్య అంటే... సుమారు 300 రోజులు నేను షూట్‌ చేసి ఉంటే, కనీసం 25 రోజులు వీళ్లిద్దరి వల్ల వృథా అయ్యాయి’’ అని చెబుతున్న రాజమౌళిని పక్కనే ఉన్న తారక్‌ సరదాగా గిల్లారు. వెంటనే ఉలిక్కి పడిన రాజమౌళి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి మాట్లాడుతూ.. ‘‘ఇద్దరికీ 30 ఏళ్లు పైన ఉంటాయి. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కోట్లలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కానీ సెట్‌లో మాత్రం ‘‘జక్కన్న చరణ్‌ నన్ను గిల్లుతున్నాడు’’ అని తారక్‌ వచ్చి నాకు ఫిర్యాదు చేస్తాడు. చరణ్‌ ఏమో అమాయకంగా చూస్తూ.. ‘‘నాకు తెలీదు. నేను డైలాగ్‌ లైన్స్‌ చూసుకుంటున్నా’’ అని అంటాడు. సుమారు 15 నిమిషాలపాటు ఇలాగే వీళ్లిద్దరూ సరదాగా ఆటపట్టించుకుంటారు. వీళ్లిద్దర్ని నేను ఎప్పుడు ఆపాలి..’’ అని చెప్పడంతో వెంటనే తారక్‌ స్పందిస్తూ.. ‘‘మీరు చూడలేదా? పెదరాయుడిలా అక్కడ కూర్చొని మీరేం చేశారు? నవ్వడం తప్ప. ఆరోజు నాపై జరిగిన దాడిని ఆపారా? ఖండించారా?’’ అనడంతో వెంటనే చరణ్‌ అందుకొని.. ‘‘ఎవరు దాడి చేశారు? అది చెప్పండి’’ అంటూ సరదాగా సంభాషించారు. ప్రస్తుతం ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి ఫొటోలకు ఫోజులిస్తుండగా, ఎన్టీఆర్‌ నడుంపై రామ్‌చరణ్‌ గిల్లడం సరదాగా అనిపించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు