Triptii Dimri: ‘లైలామజ్ను’ ఫ్లాప్‌ వేదనకు గురిచేసింది: త్రిప్తి డిమ్రి

బాలీవుడ్‌ నటి త్రిప్తి డిమ్రి తను నటించిన ‘లైలామజ్ను’చిత్రం వేదనకు గురిచేసిందన్నారు.

Published : 11 Mar 2024 20:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’(Animal) చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ నటి  త్రిప్తి డిమ్రి (Triptii Dimri). ఆమె నటించిన ‘లైలా మజ్ను’ సినిమా తన ఆలోచనలను ఏవిధంగా మార్చిందో తెలిపారు. ‘‘ఈ పరిశ్రమలోకి రాకముందు అద్దె ఇంట్లో ఉండేదాన్ని.  ‘లైలా మజ్ను’ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా. ఈ సినిమాతో అందరూ నన్ను నటిగా గుర్తుపడతారని భావించా. కానీ అలా జరగలేదు. ఆ సినిమా విజయం సాధించలేదు. దాంతో ఎంతో వేదనకు గురయ్యాను. అప్పుడు నేను చేసిన సినిమాలన్నీ ఆకట్టుకోలేకపోయాయి. ప్రతిభను మెరుగు పరచుకోవాలని నటనలో మెలుకువలు నేర్చుకున్నా. ఆ తర్వాత ‘బుల్బుల్‌’ కోసం ఆడిషన్ ఇచ్చాను. కొన్ని రోజులకు ఫోన్‌ చేశారు. అప్పుడు దర్శకురాలు అన్వితా దత్‌ను కలిశాను.  ‘మీరు ఎందుకని థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకులు ఓటీటీ ఎక్కువగా చూస్తారని చేస్తున్నారా?’ అని వారు నన్ను అడిగారు.  నాకు కథ నచ్చి సినిమాలు చేస్తున్నా అని చెప్పాను.  నా పాత్రకు ప్రాధాన్యత ఉంది అనుకున్న కథలను ఎంచుకుంటాను. కేవలం మనం సినిమాల్లో నటించగం కానీ అది విజయం సాధిస్తుందా? లేదా అన్నది ఊహించలేం’’ అని త్రిప్తి పేర్కొన్నారు. 

ప్రస్తుతం త్రిప్తి ‘మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌’, ‘విక్కీ కా వో వాలా వీడియో’ సినిమాలు చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ- గౌతమ్‌ తిన్నననూరిల స్పై థ్రిల్లర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని