Venu Thottempudi: ఆ విషయం రవితేజ చెప్తేనే తెలిసింది: వేణు తొట్టెంపూడి
వేణు తొట్టెంపూడి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ తదితర సినిమాలతో అలరించిన ఆయన కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వేణు తొట్టెంపూడి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ తదితర సినిమాలతో అలరించిన ఆయన కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా శరత్ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా వేణు విలేకరులతో మాట్లాడారు.
* ‘దమ్ము’ సినిమా తర్వాత గ్యాప్ రావడానికి కారణం?
వేణు: ప్రత్యేకమైన కారణమంటూ ఏం లేదు. మాకు చాలా వ్యాపారులున్నాయి. దాంట్లో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే ఉండేది కాదు. అప్పుడప్పుడు కొంతమంది సినిమాల కోసం సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించేవాడ్ని. అలాంటిది కరోనా లాక్డౌన్ నాలో మార్పుతీసుకొచ్చింది. ఆ సమయంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు చూశా. దాంతో నటనపై మళ్లీ ఆసక్తి పెరిగింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు దర్శకుడు శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. అందులోని నా పాత్ర సీఐ మురళికి ఫిదా అయ్యా. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జానర్ సినిమా కూడా కొత్తే. మాస్ హీరో రవితేజ సినిమాతో నేను రీఎంట్రీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.
* సీఐ మురళి పాత్ర గురించి చెప్తారా ?
వేణు: ‘రామారావు’ ఎక్కువ మందికి చేరగలిగే సినిమా. ఇందులో నటిస్తే నేను మళ్లీ వచ్చానని చాలామందికి తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఈ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పా. ఇంతకుముందు వరకు నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదనే అసంతృప్తి ఉండేది. ఈ చిత్రంతో అది తొలగిపోయింది.
* రవితేజతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
వేణు: రవితేజతో గొప్ప అనుభవం. ఆయన చాలా సింపుల్గా ఉంటారు. నేను హీరోగా నటించిన ‘స్వయంవరం’లో తాను ఓ పాత్ర చేయాల్సి ఉండగా మిస్ అయ్యారట. ఆ విషయం ఆయన చెప్పేదాక నాకు తెలియదు. అప్పటి కాంబో ఇప్పుడు కుదిరింది. నేను మొదటి నుంచీ మల్టీస్టారర్ సినిమాలపైనే ఆసక్తి చూపేవాడ్ని.
* మీ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు కదా?
వేణు: తన సినిమాల్లో నాకు సరిపడే పాత్ర ఉంటే కచ్చితంగా చెప్తారు. ‘అతడు’ సినిమాలో సోనూసూద్ పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోవడంతో ఆయన నటించారు.
* కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. రహస్యమేంటి?
వేణు: మంచి ఆహారం తినడం తప్ప నాకు మరో అలవాటు లేదు. శరీరానికి హాని చేసే వాటి గురించి నేను ఆలోచించను. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్కు దూరంగా ఉంటా. తల్లీదండ్రుల ఆశీర్వాదమే ఆ రహస్యం అనుకోవచ్చు.
* సినిమాలని కొనసాగిస్తారా ?
వేణు: కచ్చితంగా. సినిమాలతో పాటు డిజిటల్ కంటెంట్పైనా దృష్టి పెడుతున్నా. ప్రస్తుతం ‘ఛాయ్ బిస్కెట్’ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. ఓ వెబ్ సిరీస్ చర్చల దశలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.