Vishal: ఈ విజయం నా ఒక్కడిదే కాదు: విశాల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

విశాల్‌ హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. ఈ సినిమా విజయంపై విశాల్‌ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 09 Oct 2023 22:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మార్క్‌ ఆంటోని’ విజయం తనది మాత్రమే కాదని, అది అందరిదని హీరో విశాల్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. నటుడిగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘డియర్‌ మీడియా, రెండు దశాబ్దాలుగా నా జర్నీలో భాగమైన స్నేహితులకు.. కృతజ్ఞతలు. గుడ్‌, బ్యాడ్‌, నెగెటివ్‌, పాజిటివ్‌, విమర్శలు, ప్రశంసలు.. ఇలా అభిప్రాయం ఏదైనా మీ ఫీడ్‌బ్యాక్‌ నుంచి నేనెంతో నేర్చుకున్నా. వ్యక్తిగా, నటుడిగా మరింత దృఢంగా మారా. మీకు వినోదం పంచేందుకు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటా’’ అని అన్నారు. ఈ పోస్ట్‌పై ఆయన అభిమానులు, నెటిజన్లు స్పందించారు. విశాల్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

‘కొత్త బంగారులోకం’.. ఆ హీరోలు చేయాల్సింది కానీ!

‘చెల్లామే’ (ప్రేమ చదరంగం)తో 2004లో హీరోగా పరిచయమయ్యారు విశాల్‌. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుని రెండో సినిమా ‘పందెంకోడి’తో యాక్షన్‌ హీరోగా మారారు. ‘వాడు-వీడు’, ‘డిటెక్టివ్‌’, ‘ఎనిమీ’, ‘లాఠీ’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ఆయన ‘మార్క్‌ ఆంటోని’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ రూపొందించిన ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదలైంది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ పంచింది. విశాల్‌ పలు గీతాలతో గాయకుడిగాను అలరించారు. నిర్మాతగాను వ్యవహరించారు. ‘డిటెక్టివ్‌ 2’తో త్వరలో మెగాఫోన్‌ (దర్శకత్వం) పట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని